|
|
Articles: TP Features | అమ్మకానికి వార్తలు! - Site Administrator
| |
-వై.నరేంద్ర రెడ్డి
పత్రికా నిర్వహణ ఇంకెంత మాత్రం ప్రజాహితం కోసం కాదని, ఇది ఫక్తు వ్యాపారమని తెలుగు పత్రికాధిపతులు మరోసారి నిరూపించారు. అలాగే నీతులు, నైతిక విలువలు చెప్పడానికి మాత్రమేనని వాటిని ఆచరించడం పత్రికాధితుల పని కాదని కూడా వారు చాటి చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా, సక్రమంగా జరగాలని, ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్ఠానికి దోహదం చేసే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమాళిని ఖచ్చితంగా పాటించాలని ప్రవచించడం పత్రికలకు కద్దు. కానీ తమకు లాభం కలిగే పక్షంలో అభ్యర్ధులు, పార్టీలూ ఎన్ని అడ్డదారులు తొక్కినా ఫర్వాలేదని, పైగా తాము కూడా దొడ్డిదారిన సహకరిస్తామని పత్రికాధిపతులు వారితో రహస్య ఒప్పందాలు చేసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిన వేళ ఇది.
ఎన్నికలక ప్రవర్తనా నియమావళి ప్రకారం శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులు పదిలక్షల రూపాయాలకు, లోక్ సభ కు పోటీ చేసే అభ్యర్థులు 25 లక్షల రూపాయలకు మించి ఖర్చు చేయరాదు. వాహనాలు, పత్రికలు, టీవీ ఛానళ్లలో ఆయా అభ్యర్థులు ఇచ్చే ప్రకటనలు కూడా ఆ ఖర్చులోకే వస్తాయి. కానీ ఎన్నికల కమిషన్ పెట్టిన ఈ పరిమితికీ, అభ్యర్థులు పెట్టే వాస్తవ ఖర్చుకూ ఎంతమాత్రం పొంతన లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అభ్యర్థులు అడ్డదారులు తొక్కడం ఇక్కడే ప్రారంభమవుతుంది. తాము చేస్తున్న ఖర్చుకు లెక్కలు చూపకుండా వోటరును ఆకట్టుకునేందుకు ఎంతయినా ఖర్చు చేస్తూ, ఆ ఖర్చును దాచే పద్ధతుల కోసం అన్వేషిస్తుంటారు. ఎన్నికల వేళ మార్కెట్ లోకి వచ్చే నల్లధనాన్ని తాము కూడా చేతనైంత చేజిక్కించుకోవడానికి పత్రికాధిపతులు ఒక 'గొప్ప' పథకంతో ముందుకొచ్చారు. 'పెయిడ్ ఆర్టికల్స్', 'స్పాన్సర్డ్ ఆర్టికల్స్' అంటూ దానికి చక్కటి పేర్లు కూడా పెట్టారు.
వాస్తవికతను ప్రతిబింబించే వార్తలు ప్రచురించాల్సిన 'న్యూస్ కాలమ్స్'లో ఈ 'పెయిడ్ ఆర్టికల్స్' దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు ఏ పత్రికను తిరగేసినా ఇలాంటి 'వార్తలే' దర్శనమిస్తున్నాయి. అభ్యర్థుల గుణగణాలను కీర్తించడానికి, ఎన్నికల రంగంలో వారికి బలం ఉన్నా లేకపోయినా, 'అదనపు అడ్వాంటేజ్'ని తెచ్చిపెట్టడానికి వీలుగా ఈ వార్తలు రాస్తారు. ఈ వార్తలు కాని వార్తలను జర్నలిస్టులే రాయాలన్న నియమమూ లేదు. అభ్యర్థుల పిఆర్ఓలు రాసి ఇచ్చినా అది అచ్చుకు అచ్చు ముద్రితమవుతుంది. ఇటువంటి వార్తలను తాము సృష్టించుకున్నా వార్తా సంస్థలకు 'క్రెడిట్ లైన్' ఇచ్చిన పత్రికలు ఎన్నికలు దగ్గర పడేసరికి అది కూడా మానేశాయి. బోల్డ్ ఫాంట్ తో చూడగానే పాఠకులను ఇట్టే ఆకర్షించే ఈ 'వార్తలు' పత్రికా యాజమాన్యాల బొక్కసాలను నింపే సాధనాలయ్యాయి. పత్రికా రంగం విలువలను అథ:పాతాళంలో పాతి పెట్టే ఈ 'పెయిడ్ ఆర్టికల్స్' కోసం యాజమాన్యాలు వెంపర్లాడుతున్నాయి. ఇలాంటి వార్తలు తెస్తేనే మీ సాధారణ వార్తలు వస్తాయంటూ క్షేత్ర స్థాయిలో ఉండే విలేకరులకు యాజమాన్యాలు టార్గెట్లు పెడుతున్నాయి. నియోజకవర్గానికి ఇంత... జిల్లాకు ఇంత అంటూ టార్గెట్లు పెట్టి విలేకరులకు కమీషన్ల ఆశ చూపుతున్నాయి. అభ్యర్థులకు ప్యాకేజీలు ఆఫర్ చేస్తూ బేరాలు కుదుర్చుకుంటున్నాయి. ఈ వార్తలు ఎలా ఉంటాయంటే....
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|