|
|
Articles: TP Features | కన్నడంలో 'దేవుడు' - Site Administrator
| |
(ఆర్వీయస్ సుందరం)
ఏ భాషలోనైనా సరే, దేవుడైనా సరే 'డు' అనే ప్రథమా విభక్తి ప్రత్యయం ఉందంటే వాడు తెలుగు వాడే. సుమేరియన్ ప్రాచీన శిలాఫలకాల్లో గాని, పురాణాల్లోగాని 'ఎంకిడు' ఉన్నాడంటే వాడు తెలుగు వాడే. కన్నడంలో 'దేవుడు' గొప్ప రచయిత. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత. ఆయన కన్నడంలో ఎంత గొప్ప రచయిత అయినా 'దేవుడు' కాబట్టి తెలుగువాడే.
'దేవుడు' అనే పేరుతోనే ప్రసిద్ధి పొందిన నరసింహశాస్త్రి గారికి 1963లో కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి లభిచింది. 'మహాక్షత్రియ' అన్నది పురస్కారాన్ని స్వీకరించటానికి వారి ఇల్లాలు గౌరమ్మగారు ఢిల్లీ వెళ్ళారు. ఒకవేళ దేవుడు గారే జీవించి ఉంటే ఏం జరిగి ఉండేదో ఊహిస్తూ ప్రఖ్యాత కన్నడ రచయిత నిరంజన ఒక వ్యాసం వ్రాశారు. 1963 మార్చి 31న ఢిల్లీలోని విజ్ఞాన భవనంలో సాహిత్య అకాడెమీ ప్రశస్తిని ప్రధాని నెహ్రూ నుండి స్వీకరించడానికి దేవుడు వెళ్ళారట. ప్రశస్తి ప్రదానం కాగానే ఎవరో వచ్చి దేవుడితో 'నేను రాష్ట్రపతి కార్యదర్శిని. కార్యక్రమం కాగానే మీరు వెళ్ళి రాష్ట్రపతి గారిని కలవాలట' అన్నారట. నలభై సంవత్సరాల క్రితం మైసూరులో తన విద్యార్థి అయిన దేవుడు గారు వెళ్ళగానే రాధాకృష్ణన్ గారు సోఫాలో తమ పక్కనే వారిని కూర్చోబెట్టుకొని 'తెలుగులో' ఇలా అన్నారట. 'ఏమయ్యా నన్ను చూడకుండానే వెళ్ళిపోదామనుకున్నావా? అని,' దానికి దేవుడు 'లేదు సార్. వచ్చి వెళ్దామనే అనుకొన్నాను!' అని సమాధానం చెప్పారట. తర్వాత రాధాకృష్ణన్ మహా క్షత్రియ కథ ఏమిటని అడిగి తెలుసుకున్నారట.
ఇదంతా ఒక ఊహాచిత్రం. అయితే రాధాకృష్ణన్ గారు, కన్నడ రచయిత 'దేవుడు' గారు ఢిల్లీలో కలుసుకొని తెలుగులోనే మాట్లాడుకున్నారని నిరంజన గారు ఊహిచండం ఒక గొప్ప సాంస్కృతిక సందర్భన్ని సూచిస్తోంది. ఎవరు ఎలాంటి పదివిలో ఉన్నా, ఏ భాషాప్రాంతంలో ఉన్నా తల్లిభాషని మరచిపోకూడదనే సత్యాన్ని తెలుపుతోంది. దీనికి కన్నడ రచయిత నిరంజన గారికి జోహార్లప్పించాలి.
ఎం.ఎన్ వ్యాసరావ్ అనే రచయిత దేవుడు గారిని గురించి ఈ క్రింది కవిత రాశారు:
వెళ్ళిపోయిన యుగాలని కళ్ళముందుకు తెప్పించి మర్చిపోయిన ఆశ్రమాలను మళ్ళీ సృష్టించి తెచ్చి దేవలోక మర్త్యలోకాలు ఒక్కటైపోవాలని దైవత్వానికి సమీపంగా తీసుకెళ్ళారు దేవుడు మనుషుల్ని.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|