|
|
Articles: TP Features | నల్లడబ్బంతా భారత్ వస్తే.. - Venkateswara Rao Madu
| |
(దుర్గం రవీందర్)
విదేశీ బ్యాంకులోని భారతీయ నల్లధనం 75.95 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. స్విస్ బ్యాంకు ఖాతాలలోకి రహస్యంగా ధనాన్ని తరలించడంలో అగ్రస్థానంలో ఉన్న ఐదు దేశాలలో మొదటిది ఇండియాదే. 'స్విస్ బ్యాంకింగ్ అసోసియేషన్' 2008 నివేదిక ప్రకారం భారతీయ నల్లధనం 95 లక్షల కోట్లు ఆ దేశ బ్యాంకుల్లో ఉంది. భారత్ తరువాత స్థానంలో రష్యా, బ్రిటన్, ఉక్రెయిన్, చైనా దేశాలు ఉన్నాయి. ఈ నాలుగు దేశాల వారి ఖాతాలలో పోగుపడిన మొత్తం 1,17,300 కోట్ల డాలర్లుగా ఉంది. లీచ్ స్టెన్ స్టీన్ లోని ఎల్.జి.టి బ్యాంకులో తమ అక్రమ సంపాదనను దాచుకున్న భారతీయ ప్రముఖుల జాబితాను జర్మనీ ప్రభుత్వం సేకరించింది. ఆ బ్యాంకుల ఖాతాలు ఉన్న వ్యక్తుల వివరాలు అందించాల్సిందిగా జర్మనీ ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసినట్లుగా హోం మంత్రి చిదంబరం వెల్లడించారు.
అయితే, కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలన్నీ ఉత్తుత్తివే. ఈ విషయంలో వారు చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఆ డబ్బు దాచిన దొంగలందరూ కేంద్ర ప్రభుత్వానికి దగ్గరివారో, కేంద్రంలో భాగస్వామ్యం ఉన్నవారే.
ఇది స్విస్ బ్యాంకింగ్ అసోసియేషన్ తనంతట తానుగా చేసిన ప్రకటన. ఇలాంటి బ్యాంకులు ప్రపంచ వ్యాప్తంగా ఇంకా ఎన్నో ఉన్నాయి. దాదాపు అన్ని దేశాలలోని రహస్య ఖాతాల్లో అత్యధిక నిధులు దాచిన వారిలో భారతీయులే ఎక్కువ మంది ఉన్నారని ఓ అంచనా. వీరంతా ఆయా దేశాల్లో దాచిన డబ్బు వేల లక్షల కోట్లు ఉంటుంది. ఈ డబ్బు మొత్తం నోరూ వాయూలేని పేద భారతీయులది. భారతీయుల పొట్టలు కొట్టి 1948 నుండి దేశ నాయకులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు, స్మగ్లర్లూ దొంగరు దాచిన సొమ్ము అది.
దేశం బయట రహస్య ఖాతాల్లో ఉన్న నల్లడబ్బు విషయం అలా ఉంటే దేశం లోపల ఉన్న నల్లడబ్బు కూడా దాదాపు లక్షల కోట్లలో ఉంటుంది. ఆదాయం కన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నవారిపై ఆర్థిక శాఖ, అవినీతి నిరోధక శాఖ మొక్కుబడిగా ఏటా కొన్ని కేసులు నమోదుచేసి చేతులు దులుపుకుంటున్నాయి. ఈ విధానం క్షంతవ్యం కాదు. అయినా అటు ప్రజలు ఇటు ప్రతిపక్షాలు, ఆర్థిక విషయాల ఆకళింపు చేసుకొన్న వామపక్షాలు ఈ విషయమై స్పందించకుండా ఉండటం విడ్డూరం.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|