|
|
Articles: TP Features | కౌంటరేది? ఎన్ కౌంటరేది? - Site Administrator
| |
(వుప్పల నరసింహం)
బూటకపు ఎదురు కాల్పులకు, అమాయక గిరిజనుల హత్యలకు నిరసనగా మావోయిస్టులు మే 20 నుంచి రెండు రోజులు బంద్ కు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రలలో బంద్ పాటించవలసిందిగా మావోయిస్టులు హుకుం జారీ చేశారు.
పాశవికమైన ప్రభుత్వం బూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పడి అమాయక గిరిజనులను హత్య చేసింది వాస్తవమే.
ఈ అన్యాయాన్ని ఎదిరించడాన్ని లోకానికి చాటి చెప్పేందుకు నాలుగు రాష్ట్రాల్లో బంద్ కు పిలుపునిచ్చి జన జాగృతికి పిలుపునిచ్చారు. బాగానే ఉంది. ప్రభుత్వం చేస్తున్న దాష్టీకాన్ని విశాల ప్రజా శ్రేణులకు తెలపాలి. వారిని చైతన్యవంతుల్ని చేయాలి. అందుకు బంద్ పిలుపునిచ్చి కార్యాచరణకు పూనుకున్నారు, బాగుంది.
మావోయిస్టులు ప్రభుత్వంపై ఏ ఆరోపణలు చేశారో, చేస్తున్నారో అచ్చం అవే వారి సమాంతర ప్రభుత్వం కొనసాగుతున్న `రెడ్ కారిడార్' ప్రదేశంలో జరగడమే విడ్డూరం - విషాదం. దీన్ని తప్పు అని లోకానికి చాటుతూ అదే తప్పును అంతకన్నా ఎక్కువ కఠినంగా చేయడం వల్ల మావోయిస్టుల మాటకు విలువ ఉంటుందా? వారి బంద్ కు ప్రజలు స్పందిస్తారా? వారి కార్యాచరణను ఆదరిస్తారా? వారి హత్యలకు అనుమతిస్తారా? అన్నది కూడా వారు ఆలోచించి ఉండాల్సింది.
బంద్ కు పిలుపునిచ్చిన మూడు రోజుల ముందే మే 18న మావోయిస్టులు విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని హుకుంపేట మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిని హతమార్చారు. అదే రోజు మాజీ దళ సభ్యుడిని సైతం పొట్టన పెట్టుకున్నారు.
ఇదిలా ఉండగా మరుసటి రోజు అదే ప్రాంతంలో ఒక మహిళా సర్పంచ్ ఇంటిపై దాడి చేసి, ఆమె భర్తను చితకబాదారు. అంతేనా...? కాదు వారి రేషన్ దుకాణాన్ని దోచుకున్నారు. దుకాణంలోని నగదు, ఖరీదైన వస్తువులు తీసుకెళ్ళారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|