|
|
Articles: TP Features | గద్దర్ గురించి గోరంత... - Site Administrator
| |
(వుప్పల నరసింహం)
జనశక్తి నక్సలైట్ నాయకుడు కూర రాజన్నకు గుండెపోటు వచ్చింది. ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. అంతకు ముందు ఇతర అనారోగ్య కారణాల వల్ల ఆయన ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందారు. అప్పుడు తెరాస నాయకుడు చంద్రశేఖర్ రావుతో సహా ఎందరో పరామర్శించారు.
ఇప్పుడు గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరగానే ఈ సారి కూడా చాలా మంది ఆయనను పరామర్శించారు. త్వరగా కోలుకుని ఆసుపత్రి నుంచి బయటకు రావాలని తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. మావోయిస్టు గాయకుడు `బహురూపి' గద్దర్ కూడా కూర రాజన్నను పరామర్శించారు. నెల రోజులకు పైగా తనకు తాను విధించుకున్న అజ్ఞాతవాసం (నాటకం) నుంచి బయటపడిన అనంతరం ఆసుపత్రి ఆవరణలో ఆయన మీడియాకు కనిపించారు.
ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ కూరరాజన్న కోలుకోవడానికి, మంచి చికిత్స ఇప్పించేందుకు అవసరమయ్యే ఖర్చులను ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేస్తున్నానని గద్దర్ సెలవిచ్చారు.
ఇందులో ఆక్షేపించడానికి ఏమీ లేదు. తప్పు పట్టడానికి కూడా ఏమీలేదు. ప్రతిసారీ వాడే పదజాలంతోనే ఆయన మాట్లాడారు. కానీ...
కూర రాజన్న గతంలో చేయించుకున్న చికిత్సకు ఖర్చులు ప్రభుత్వమే భరించింది. గద్దర్ చేయించుకున్న చికిత్సకు ఖర్చు ప్రభుత్వమే భరించింది. ఈ సారి కూడా ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి గాని, మరో పథకం ద్వారా గాని రాజన్నకు సహాయం అందవచ్చు. అందుకు అవసరమైన పనులు జరుగుతూనే ఉన్నాయి.
| Read 7 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|