|
|
Articles: TP Features | ఆరోగ్యమే మహాభాగ్యం - Site Administrator
| |
(ఆచార్య ఆర్వీయస్ సుందరం)
ఆరోగ్యమే మహాభాగ్యమని అందరికీ తెలిసిన విషయమే. కాని ఆరోగ్యం మందుల వల్ల లభిస్తుందనే ఆలోచనే తప్పని చెప్తూ ఆరోగ్యానికి, ఆహారానికి, పర్యావరణానికి ఉన్న సంబంధాన్ని పరిపరి విధాల ప్రచారం చేస్తున్న విజ్ఞానవేత్త డాక్టర్ ఖాదర్ దూదేకుల. ఒక దశాబ్దికి పైగా మైసూరు నగరాన్ని నివాసస్థానంగా, కార్యనిర్వహణ కేంద్రంగా చేసుకొని ప్రజల్ని ఉత్తేజితుల్నిచేస్తున్న డాక్టర్ ఖాదర్ హోమియోపతి వైద్య రంగంలో చేస్తున్న కృషి అసాధారణం.
ఖాదర్ కడపజిల్లా ప్రొద్దుటూరులో 1959లో జన్మించారు. ఇంటర్మీడియట్ వరకు ఆంధ్రప్రదేశ్ లో చదివి తర్వాత మైసూరులోని రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ లో రసాయన శాస్త్రంలో ఎం.ఎస్.సి.ఎడ్. వరకు చదివారు. ఆ తరువాత బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సులో జీవరసాయన శాస్త్రంలో పి.హెచ్.డి పట్టా పొందారు. ఈ చదువులతో ఆగి ఏదో ఒక విశ్వవిద్యాలయంలో ఆచార్యులై ఉంటే డాక్టర్ ఖాదర్ జీవితం మరో విధంగా ఉండేది. అయితే తమ జీవితాన్ని తామే మలుపులు తిప్పుకున్నారు.
అమెరికాలో ఒరెగాన్ విశ్వవిద్యాలయంలో నాలుగేళ్ళ పాటు పర్యావరణ శాస్త్రరంగంలో పరిశోధన జరుపుతూ ఈ విషయంలో అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఎన్ని పొరపాట్లు చేస్తున్నాయో ఎత్తి చూపారు డాక్టర్ ఖాదర్. అభ్యుదయ భావాలు కలిగినవారు కావటం, మానవ జీవితం పట్ల శాస్త్రీయ అవగాహన కలిగి ఉండటం ఈ శాస్త్రవేత్తలో విశేషం. 1991లో భారతదేశానికి తిరిగి వచ్చి మైసూరులోని భారతీయ ఆహార పరిశోధన సంస్థలో సీనియర్ సైంటిస్ట్ గా రెండేళ్ళు పనిచేశారాయన. మళ్ళీ అమెరికా వెళ్ళి డుపాంట్ అనే ప్రసిద్ధ రసాయన సంస్థలో శాస్త్రవేత్తగా నాలుగేళ్ళు, పర్యావరణ శాస్త్ర విభాగాధిపతిగా ఒక ఏడాది పనిచేశారు. డుపాంట్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ బహుళజాతీయ సంస్థలలో, విశ్వవిద్యాలయాలలో, ఆహార పరిశోధన సంస్థలలో పనిచేసిన డాక్టర్ ఖాదర్ ఈ ఉన్నత పదవులన్నిటినీ వదులుకొని స్వచ్ఛందంగా ప్రజల అవసరాలు, కష్టాలను తీర్చే మార్గాన్ని అన్వేషించడమే విచిత్రంగా కనిపిస్తున్నది. అయితే ఆయన ఎంపిక చేసుకున్న మార్గం విశిష్టమైంది. మార్గదర్శకమైంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|