|
|
Articles: TP Features | శతాబ్దాలన్నీ శ్రీశ్రీవే - Site Administrator
| |
రెండే రెండు అక్షరాలు...మొత్తం తెలుగు సాహితీ జగత్తునే శాసించారు. శ్వాసించాయి. అటు ప్రాచీనం, ఇటు అర్వాచీనం రెండింటిపైనా చెరొక కాలు నిలిపి తివిక్రమావతారమెత్తి అక్షర తూణీరాలను సంధించాయి. ఆ రెండక్షరాల పేరే శ్రీశ్రీ. ఎవరి పేరుకైనా ముందు గౌరవ వాచకంగా శ్రీ అన్న అక్షరాన్ని వాడుతారు. మరి రెండు శ్రీలు కలిగిన అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న వాడు ఈ మహాకవి. శ్రీరంగం శ్రీనివాసరావు అంటే తెలియకపోవచ్చునేమో కానీ, శ్రీశ్రీ అంటే ఎరుగని వారు బహుశా ఎవరూ ఉండరు.
అది 1910వ సంవత్సరం, తెలుగు సాహిత్యానికి మేలి మలుపైన వత్సరం. ఆ సంవత్సరమే గురజాడ అప్పారావు రచించిన ముత్యాల సరాలు విడుదలైంది. అదే సంవత్సరం మహా కవి శ్రీశ్రీ పుట్టాడు. ఇది కాకతాళీయంగా జరిగినా గురజాడ తన సాహిత్యాన్ని ఎక్కడైతే ఆపేశాడే దానికి కొనసాగింపుగానే శ్రీశ్రీ జననం జరిగిందన్నది సాహితీ విమర్శకుల నిశ్చితాభిప్రాయం. విశాఖపట్నంలో పుట్టిన శ్రీశ్రీ ఇక్కడే ఎవిఎన్ కళాశాలలో విద్యను అభ్యసించాడు. విశాఖ, భీమిలీల మధ్య తన యవ్వన ప్రాయమంతా గడిపాడు. అంబరాన్ని చుంబించాలని ఆరాటపడుతున్న కెరటాలను తనివితీరా వీక్షించాడు. తనలోని అలోచనలకు మెలమెల్లగా అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం చేశాడు. శ్రీశ్రీకి తొలి నాళ్లలో అభిమానపాత్రులు కవిసమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ, భావ కవి దేవులపల్లి వేంకట కష్ణశాస్ర్తి. వారి కవితలను చదివి అదే శైలిలో రాయాలని తెగ ఉబలాటపడేవాడు. అలాగే, రాసేందుకు యత్నించేవాడు. అందువల్లనే శ్రీశ్రీ మొదటితరం కవిత్వమంతా భావ, సంప్రదాయ కవిత్వంగా సృజింపబడింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|