|
|
Articles: My Thoughts | వైఎస్ నీటి రాజకీయం - Site Administrator
| |
(డా.దుగ్గరాజు శ్రీనివాసరావు)
మింగ మెతుకు లేదు... మీసాలకు సంపెంగనూనె..., ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానందట... ఇటువంటి సామెతలు ఎన్నైనా గుర్తుకు వస్తాయి వైఎస్ ప్రభుత్వం ప్రకటిస్తున్న విధానాలు వింటుంటే. అధికారంలోకి రాగానే ఆయన ప్రతిపాదించిన సహకార వ్యవసాయ విధానం రాష్ట్రంలో ప్రజలు అధికారం ఎవరికి ఇచ్చినా ఆ ప్రభుత్వాన్ని నడిపించేది మాత్రం ప్రపంచ బ్యాంక్ అనేది స్పష్టమైంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా మాట్లాడిన `కార్పొరేట్ వ్యవసాయం' అనే పదాన్ని కొంచెం మార్చి అమలు చేస్తున్నాడు వైఎస్. చంద్రబాబు చెప్పిన `ప్రత్యామ్నాయ వ్యవసాయం, బిందు సేద్యం' వంటివి రైతులు ఛీ కొట్టినవే. తిరిగి వాటినే చంక నెత్తుకుంటున్నాడు వైఎస్.
అయితే ఒక విషయం స్పష్టం. రాజకీయ ప్రయోజనం లేకుండా వైఎస్ ఏ పనీ చేయడు. ఆయన ఇటీవల చేసిన గ్రామాలకు మినరల్ వాటర్ సరఫరా పథకం ఒక కొత్త రాజకీయ బ్యాంక్ నిర్మాణానికి నాంది. గతంలో పాల సహకార సంఘాలు పెట్టి కొందరు నాయకులు ఆయా జిల్లాలలో రాజకీయ పెత్తనం తమ చేతిలోకి తెచ్చుకున్నారు. పాల సహకార సంఘంలో చేరితేనే ఆ గ్రామంలో మనుగడ. అది కాదనుకుంటే రైతు బ్రతకలేడు. ఆ పాల సహకార సంఘంమీద పెత్తనం రాజకీయ ఎదుగుదలకు మూలం అవుతుంది. మనరాష్ట్రంలో పాల సహకార సంఘాలు రాజకీయ పెత్తనం చెలాయిస్తే, మహారాష్ట్రలో సహకార చక్కెర మిల్లుల పెత్తనం శరద్ పవార్ వంటివాడిని రాజకీయ పెద్దను చేసింది.
ఆ కోవలోనే ఇప్పుడు వైఎస్ నీటి రాజకీయం నడపబోతున్నాడు. ఇవి పాల, చక్కెర రాజకీయాలకన్నా భయంకరంగా ఉంటాయి. పాలు, చక్కెర ఉత్పత్తిలో మనుషులు కష్టపడాల్సిన అవసరముంటుంది. కాని నీటి విషయంలో ఆ కష్టం కూడా లేదు. ప్రకృతి వనరులు కొందరు వ్యక్తులు తమ సొంతం చేసుకుని, రాజకీయ ఆధిపత్యానికి అవసరమైన వేదికలను నిర్మించుకుంటారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|