|
|
Articles: My Thoughts | బహునాయకత్వం - Site Administrator
| |
డా.పి.శివరామకృష్ణ
రాజస్థాన్ లో అంగన్ వాడీ కార్యకర్తగా (సాథీ) పనిచేస్తూ గ్రామస్తులను చైతన్యవంతం చేస్తున్న దళిత మహిళమీద కొందరు అత్యాచారం చేశారు. ఈ ఘటన 1980లో చాలా సంచలనం కలిగించింది. ఆ మహిళ కేసును చివరకు న్యాయస్థానం కొట్టివేసింది. ఆ వృత్తాంతాన్ని దీప్తినావల్ 'బవెండర్' (ఇసుక తుఫాను) అనే సినిమాగా హిందీలో తీశారు. కొంతమంది ఢిల్లీ ప్రజాసంఘాలవారు వచ్చి, కేసు బలంగా ఉండాలని కొంత మసాలా దట్టించారు. కేసు పోవడానికి వీరి అత్యుత్సాహం కూడా ఒక కారణమని, ఈనాటి ప్రజాఉద్యమాల నాయకత్వం మీద ఈ సినిమాలో చురకలు అంటించారు.
1970లో కేరళలోని సైలెంట్ వ్యాలీలో జలవిద్యుత్ ప్రాజెక్టు, హిమాలయాలలో చిప్ కో ఉద్యమం వల్ల అడవుల నరికివేత, ఒరిస్సాలోని గంధమాదన పర్వతంలో బాక్సైట్ తవ్వకం, ఆనాటి మధ్యప్రదేశ్ లోని (నేడు చత్తీస్ గడ్ ) బోధ్ ఘాట్ జలవిద్యుత్ ప్రాజెక్టు ప్రజాందోళనలవలన ఆగిపోయాయి. 1990-2000 దశకం వచ్చేసరికి ఉద్యమాల దిశ మారింది. కేరళలో కోకో-కోలా కంపెనీ పల్చమడ గ్రామంలో భూగర్భజలాలను తోడుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఒరిస్సాలోని నియమగిరి అడవులలో 'వేదాంత' కంపెనీ కాకపోతే దాని అనుబంధ సంస్థ స్టెరిలైట్ కంపెనీ బాక్సైట్ ఖనిజం తవ్వుకోవచ్చని కోర్టు సూచించింది. ఉత్తరఖండ్ లో టెహ్రీడ్యామ్ నిర్మాణాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అనుమతించింది. నర్మదాడ్యామ్ సంగతి అందరికీ తెలిసిందే.
కోర్టు మొదట్లో స్టే ఇవ్వగానే ఉద్యమకారులు ప్రపంచమంతా తిరిగి తమ ఉద్యమానికి మద్దతు కూడగట్టుకుంటూ ప్రచారం నిర్వహించడం - స్టే తొలిగించడంతో ఈ ఉద్యమాలు చల్లారిపోవడం - బాధితులైన ప్రజలు పరిస్థితులతో రాజీపడడం - ఉద్యమనాయకులు మరోచోట మరో ఉద్యమంలో దూకడానికి తరలిపోవడం, వార్తలలో వెలిగిపోతుండడం సాధారణమైపోయింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|