|
|
Articles: My Thoughts | పంటలపై విదేశీ పెత్తనం - Site Administrator
| |
(స్వాభిమాని)
ఉన్నత విద్యారంగం నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నది... ఆరోగ్యరంగం నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నది... చివరికి వ్యవసాయరంగం నుండి ప్రభుత్వ కూడా తప్పుకోవాలనుకుంటున్నది. సామాన్య మానవుడి అవసరమైన కీలక రంగాలన్నింటినీ ప్రయివేటీకరించి ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నది. అయితే చేతులు దులుపుకుని, ఆ దులుపుకున్న చేతితో బహుళజాతి సంస్థల నుండి లంచాలు తీసుకుని మొత్తం దేశాన్ని వారికి అప్పగించేస్తున్నది.
బ్రిటీష్ వాడు వచ్చేనాటికి భారతదేశం అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉన్నందువల్ల తెల్లవాడు సులభంగా కబళించగలిగాడన్నారు. కాని నేడు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం దేశమంతా ఒక్కటే. అందుకే తెల్లవాడి బహుళజాతి సంస్థలు మరింత సులభంగా దేశాన్ని కబళించగలుగుతున్నాయి. నేడు మన కేంద్రమంత్రులంతా విదేశీ సంస్థలను ఆహ్వానించే జాతీయ ఆహ్వాన సంఘాలకు అధ్యక్షులు మాత్రమే. వారు జరిపే మంతనాలన్నీ తమకు ఏ మేరకు కమిషన్ ముట్టచెపుతారనే. కమ్యూనికేషన్ మంత్రి రాజా దొరికిన దొంగ మాత్రమే.
బహుళజాతి సంస్థలకనుకూలంగా విధాన నిర్ణయాలు చేసేందుకే నేటి ప్రభుత్వాలున్నాయి. వైఎస్ ప్రతిపాదించిన 'కలెక్టివ్ ఫార్మింగ్' సూత్రం కూడా అందులో భాగమే. మన సొంత వ్యవసాయ విధానం పక్కన పెట్టి అవతలి వాడికి మేలు చేసే విధానాలను తయారుచేస్తున్నారు. వ్యవసాయరంగాన్ని విదేశీయులకు అమ్మివేసే ప్రక్రియ 1990లోనే ఆరంభమైంది. అప్పటి నుండే వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో ఏం జరుగుతున్నది? కేవలం విదేశీసంస్థలు స్పాన్సర్ చేసిన పరిశోదనలు చేస్తున్నారు. వారికి ఏం కావాలో, ఏ విధంగా కావాలో ఆ పద్ధతిలో పరిశోధనలు చేసి ఫలితాలు అందించి డాలర్లు అందుకుంటున్నారు. అందుకే ఈ రోజుల్లో ఐసిఎఆర్ సంస్థలలో తన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోకి అడుగుపెడితే అక్కడ కనిపించే అంశాలు ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|