|
|
Articles: My Thoughts | ఐవిఎస్ అవిరళ కృషి - Site Administrator
| |
(సత్యవాణి జెవి)
భాష ములకంగా సంస్కృతి అధ్యయనానికి నాంది పలుకవలసిన అవసరాన్ని గుర్తించిన ప్రసిద్ధ భాషా శాస్త్రవేత్తల్లో ఆచార్య ఐ.సుబ్రహ్మణ్యంగారొకరు. ఆచార్య వి.ఐ.సుబ్రహ్మణ్యంగారు ప్రపంచ స్థాయిలో ఖ్యాతి గడించిన భారతీయ భాషా శాస్త్రవేత్త మాత్రమే కాకుండా, ఎన్నో భాషా శాస్త్రాధ్యయన సంస్థలు నెలకొల్పి, తరతరాలుగా పఠన పరిశోధనలు జరగడానికి కూడా కారకులయ్యారు.
భారతదేశంలోనే కాక ప్రపంచదేశాల్లో ద్రావిడ అధ్యయనానికి సారథ్యం వహించారు.
ఆచార్య వి.ఐ.సుబ్రహ్మణ్యంగారు తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా, వరుసేరిలో 1926లో జన్మించారు. ఈయన విద్యాభ్యాసం నాగర్ కోవిల్ లోని స్కాట్ క్రిష్టియన్ కాలేజీలోను, అన్నామలై విశ్వవిద్యాలయంలోను జరిగింది. తమిళ, ద్రావిడ భాషాశాస్త్రాల్లో పేరెన్నికగన్న వీరు తమ పిహెచ్ డి. పట్టా యుఎస్ ఏ లోని ఇండియానా విశ్వవిద్యాలయంలో పుచ్చుకున్నారు. తిరువనంతపురంలోని అంతర్జాతీయ ద్రావడ భాషాశాస్త్ర పీఠంలో ప్రాచార్యులుగా ఉండగానే కీర్తిశేషులయ్యారు. ద్రావిడ భాషాశాస్త్రం పట్ల ప్రపంచానికి అభిలాష కల్పించినవారిలో ఒకరవటమే కాదు, ఈ భాషాధ్యయనాన్ని దేశీయ ఐక్యత కోసం పరికల్పించారనటంలో సందేహం లేదు. దాదాపు 6 దశాబ్దాల పాటు భాషా శాస్త్రాధ్యయనానికై అహర్నిశలూ కృషి చేశారు.
ప్రాచార్య సుబ్రహ్మణ్యంగారికి సాంప్రదాయిక, ఆధునిక పద్ధతులు రెండింటిమీదా భాషా విషయకంగా మంచిపట్టుంది. ఆయన వ్యాసాలూ, రచనలూ ఇందుకు సాక్ష్యం. ద్రావిడ భాషా మాండలికాలమీద జరిగిన పరిశోధనలకూ, ప్రచురణలకూ ఆయన సంపాదకత్వంలో వెలువడ్డ 'సర్వే ఆఫ్ ది మలయాళం డైలెక్ట్స్'ఒక ఉదాహరణ ప్రాయం. ద్రావిడ భాషావేత్తలకు, పరిశోధనలకు ఆయన ప్రధాన సంపాదకులుగా సంకలనం చేసిన 'ద్రవిడియన్ ఎన్ సైక్లో పీడియా' బంగారుగని లాంటిది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|