|
|
Articles: My Thoughts | 'ఐచ్ఛికంగానే మాతృభాష' - Site Administrator
| |
(కంచ ఐలయ్య)
ముగ్గురు జడ్జీలు గల ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి శ్రీ బాలకృష్ణన్ నేతృత్వంలో భారత సుప్రీంకోర్టు జూలై 21న ఒక అద్భుతమైన తీర్పునిచ్చింది. మనదేశంలోని విద్యారంగాన్ని పూర్తిగా మార్చటానికి జరుగుతున్న చర్చకు ఈ తీర్పు తెరదించింది. ప్రాధమిక, మాధ్యమిక పాఠశాలలో ముఖ్యంగా ప్రభుత్వం నడిపే పాఠశాలల్లో ఇంగ్లీషు బోధన అంటే ఇంగ్లీషు మీడియంలో విద్య, సరైంది కాదని గత కొన్నేళ్ళుగా వాదిస్తున్నారు.
కాని, ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీషు ప్రవేశపెడితే మాతృభష, సంస్కృతి చచ్చిపోతాయని చాలా మంది వాదిస్తూ వచ్చారు. కర్ణాటకలో ఇటివంటి వాదనలకు లొంగి అక్కడి ప్రభుత్వం బెంగళూరు చుట్టూ ఉన్న చాలా ప్రాథమిక ఇంగ్లీషు మీడియం స్కూళ్ళను మూసివేసింది. వాటి యాజమాన్యాలు కర్ణాటక హై కోర్టులో కేసు వేయడంతో కోర్టు స్టే ఇచ్చింది. దీంతో ప్రభుత్వం ఆ సమస్య సుప్రీంకోర్టుకు తీసుకుపోయింది. అక్కడ ప్రాథమిక విద్యలో ఏ మీడియంలో చదువు చెప్పాలి అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రాజ్యం మాతృభాషను పిల్లలపై రుద్దడానికి వీలులేదని తేల్చిచెప్పింది. అంతేకాక గ్రామీణ ప్రాంతంలో చదువుకునే పిల్లలు ప్రాథమిక దశ నుండి ఇంగ్లీషు మీడియంలో చదువుకోకపోతే క్లర్కులు కూడా కాలేని పరిస్థితి ఉందని, అందువల్ల ఏ మీడియంలో చదివించాలో తల్లితండ్రులు మాత్రమే నిర్ణయించుకోవాలిగాని ప్రభుత్వం వారి మీద మాతృభాషను రుద్ది వారి భవిష్యత్ ను దెబ్బతియ్యరాదని తేల్చి చెప్పింది.
కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది మాతృభాషలో చదువుకుంటేనే పిల్లలు క్రియాశీల మేధావులవుతారనే వాదనను సుప్రీంకోర్టు త్రోసి పుచ్చింది. మాతృభాషలో విద్యాబోధన మాత్రమే ప్రాంతాల, రాష్ట్రాల సంస్కృతులను కాపాడుతుందనే వాదనను కూడా సుప్రీంకోర్టు ధిక్కరించింది. అసలు భాషకు సంస్కృతికి సంబంధంలేదని నేను చాలా కాలంగా వాదిస్తూనే ఉన్నాను. గ్రామ జీవితం నుండి వచ్చి ఇంగ్లీషు భాషలో ఆలోచించి, రాసే నా జీవితంలో సంస్కృతి పూర్తిగా మారిన పరిస్థితి లేదు. సంస్కృతి, పంటలు, తిండి, బట్ట, మతం మొదలగు అంశాలతో ముడిపడి ఉంటుంది గాని ఒక్క భాషతో మాత్రమే ముడిపడి ఉండదు. సుప్రీంకోర్టు కూడా దాదాపు అటువంటి నిర్ణయాన్నే ప్రకటించింది. పిల్లలు స్కూళ్ళలో చదువుకునేటప్పుడు ముఖ్యంగ్రా ఫ్రీ-స్కూలు, ప్రాథమిక స్కూళ్ళలో చదువుతున్నప్పుడు వాళ్ళకు అన్ని వర్గాల పిల్లలతో మాట్లాడే భాషను బోధించాలి. పాలకవర్గం, అగ్రకులాల వారు మూడవ ఏటనుండి ఇంగ్లీషు నేర్చుకుంటున్నప్పుడు పేద పిల్లలు, దళిత బహుజన పిల్లలు తెలుగు, ఇతర మాతృభాషలో విద్య నేర్చుకోవడం వల్ల చాలా వెనుకబడిపోతున్నారు. ఇది మనం అనుభవంలో చూస్తున్నాం. ఈ పరిస్థితిని సుప్రీంకోర్టు కూడా గమనించింది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|