|
|
Articles: Devotion | ఒకటికి పది రెట్లు - Mr. Pratap Cherukuri Pratap
| |
భక్తులకు వచ్చిన లేక రాబోయే కష్టాలను తీర్చేందుకు బాబా తరచుగా వారి వద్ద నుండి దక్షిణ స్వీకరించేవారు. నేనెవరి నుండైనా ఒక రూపాయి దక్షిణగా స్వీకరిస్తే దానికి పది రెట్లు తిరిగి వారికి ఇవ్వవలిసి వుంటుంది. ఆ ఫకీరు చూపిన వారి నుండి మాత్రమే నేను దక్షిణ స్వీకరిస్తాను. నేను తీసుకునే ప్రతీ పైసాకు ఆ పరమాత్మకు తిరిగి లెక్క అప్పజెప్పవలిసి వుంటుంది అని దక్షిణ విషయమై బాబా తరచుగా అంటుండేవారు.
ఒకసారి బి.వి.దేవ్ అయిదు గదులలో ఒక ఇల్లు నిర్మింపదలిచి ప్లాను కాగితం తీసుకొని సాయి అనుమతి కోరాడు. సాయి తమ సటకాతో నేలపై ఇరవై అయిదు గీతలు తీసి 'ఒక్కొక్క గదికి ఒక రూపాయి చొప్పున ఇరవై అయిదు రూపాయలు ఇవ్వు' అని అన్నారు. సాయి మాటలు దేవ్ కు అర్ధం కాలేదు. అయినా గురువు ఆజ్ఞ శిరసావహించి ఇరవై అయిదు రూపాయలను దక్షిణగా సమర్పించుకొని, సాయి ఆశీర్వాదాలను తీసుకొని తిరిగి తన స్వగ్రామం వెళ్ళిపోయాడు. ఒక శుభ ముహూర్తంలో భూమి పూజ చేసి ఇల్లు కట్టడం ప్రారంభించాడు. ఇల్లు నిర్మాణం లో వుండగానే అనుకోని విధంగా వనరులు సమకూరడం వలన ఒక్కొక్క గది పెంచుకుంటూ వెళ్ళి ఆఖరుకు 25 గదులతో అయిదు అంతస్థుల భవనం కట్టాడు. అప్పుడు దేవ్ కు సాయి అన్న మాటలు గుర్తుకు వచ్చి తనపై అసాధారణ రీతిలో అనుగ్రహం వర్షం కురిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. జీవితాంతం సాయికి ముఖ్యమైన భక్తుడిగా మిగిలిపోయాడు.
మరొక సందర్భంలో కోపర్గావ్ లో ఇనెస్పెక్టెర్ గా పని చేస్తున్న సోమనాధ్ కు పై అధికారి అనుచిత నిర్ణయం వలన ఒక ఇంక్రిమెంట్ ఆగిపోయింది. ఆ ఇంక్రిమెంట్ ను శాంక్షన్ చెయ్యమని వందలాది అర్జీలను ప్రభుత్వానికి పెట్టుకున్నా అన్నీ బుట్ట దాఖలు అయ్యాయి. ఇక ఆ విషయంపై ఆశ వదులుకున్నాడు సోమనాధ్. ఒకసారి మిత్రుల ప్రోద్భలంతో శిరిడీ వచ్చి సాయిని దర్శించుకొని తన బాధలను చెప్పుకున్నాడు. సాయి అతని వద్ద నుండి పది రూపాయలు దక్షిణ తీసుకొని అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు. సాయి వాక్కు బ్రహ్మ వాక్కుతో సమానం. నెల రోజుల లోనే ఆగిపోయిన ఇంక్రిమెంట్ పది రూపాయలను ప్రభుత్వం శాంక్షన్ చేయడమే కాక ముందు కాలానికి ఎరియర్స్ కూడా చెల్లించింది. కష్టాలలో మునిగి తేలుతున్న సోమనాధ్ కుటుంబానికి ఆసరా దొరికినట్లయ్యింది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|