|
|
Articles: Short Stories | భగవద్దర్శనం - Mr. Pratap Cherukuri Pratap
| |
పూర్వం మందగిరి అరణ్య ప్రాంతం లో ఒక గురు కులం వుండేది. అక్కడికి దేశం నలుమూలల నుండి ఎందరో విధ్యార్ధులు విద్యాభ్యాసం కోసం వస్తుండేవారు. ఆ గురుకులానికి అధిపతి చిదానంద మహర్షుల వారు. చిదానంద మహర్షి సకల వేద పారంగతుడు. సకల శాస్త్రాలను, ఉపనిషత్తులను,పురాణేతిహాసాలను ఔపాసన పట్టిన దిట్ట. తన తప:శ్శక్తితో తన గురుకులానికి వచ్చే ఎందరికో ఎన్నో వ్యాధులను నయం చేసేవారు. తన శిష్యులను తన కంటే ఉత్తములుగా తీర్చి దిద్దాలని సదా తాపత్రయపడుతుండేవారు. ఆ గురుకులంలో రామశాస్త్రి అనే బ్రాహ్మణ బాలుడు విద్యాభ్యాసం చేస్తుండేవాడు. రామశాస్త్రి స్వతాహాగా చాలా తెలివైన వాడు. ఏక సంధాగ్రహి. గురువు చెప్పిన అతి క్లిష్టమైన పాఠాలను ఠక్కున అర్ధం చేసుకొని గుర్తుంచుకొనడమే కాదు, అడిగినప్పుడల్లా వెంటనే తిరిగి అప్పజెప్పేవాడు. తాను నేర్చుకున్న పాఠాలలో సందేహాలు కలిగితే ఏ మాత్రం సంశయం లేకుండా గురువు గారి దగ్గరకు వెళ్ళి సందేహ నివృత్తి చేసుకునేవాడు. రామశాస్త్రి యొక్క బహుముఖ ప్రజ్ఞకు,తెలివితేటలకు సాటి విద్యార్ధులే కాక చిదానంద మహర్షి సైతం ఆశ్చర్యపోతుండేవారు.
ఒక సారి రామశాస్త్రి మహర్షుల వారు చెప్పిన భగవంతుని సర్వ వ్యాపక తత్వం అనే పాఠాన్ని తిరిగి వల్లె వేస్తుండగా భగవంతుడు ఎలా వుంటాడు అనే సందేహం కలిగింది. వెంటనే ధ్యానం చేసుకుంటున్న మహర్షుల పాదాలకు నమస్కరించి తన సందేహాన్ని తెలియజేసాడు. 'గురుదేవా! మీరు భగవంతుడు ఈ సకల చరా చర సృష్టిలో చివరకు జడమైన పధార్ధాలలో కూడా అంతటా వ్యాపించి వుంటాడని తెలియజేసారు. అసలు ఆ పరమాత్ముని స్వరూపమేమిటి? ఏ రూపంలో ఈ విశ్వమంతటా వ్యాపించి వున్నాడు? ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలని నాకు గాఢంగా వుంది' అన్నాడు రామశాస్త్రి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|