|
|
Articles: TP Features | కట్టు జారిన మీడియా? - Site Administrator
| |
(సుందర్)
సరిగ్గా ఐదేళ్ల క్రితం అత్యంత భయానకమైన సునామీ సంభవించి చాలా తీర ప్రాంతాల్లో వినాశనం సృష్టించింది. అలానే 2009 చివరి అంకంలో దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలు కూడా అలాంటి సునామీలోనే కొట్టుకుపోయాయనిపిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు చట్ట సభల ప్రతినిధులు, అధికార యంత్రాంగం, న్యాయవ్యవస్థ, మీడియాలు పునాదులు. అయితే ఈ వ్యవస్ధలన్నీ వివిధ సందర్భాల్లో కళంకం రుద్దుకున్నవే. అంతేకాక ప్రపంచంలో భారత్ సూపర్ శక్తిగా ఆవిర్భవించాలన్న ఆశలపై ఈ వ్యవస్థలు పైపైపూతలు పూస్తున్నాయి.
భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన నాలుగో స్తంభమైన మీడియాను అవలోకనం చేస్తే ఎన్నో దిగ్భ్రాంతిరకమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. భారత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తాను రూపొందించుకున్న జర్నలిజం ప్రమాణాల సెక్షన్ లో 'ఒకప్పుడు జర్నలిజం లక్ష్యంగా ఉండేది. కాలక్రమేణా క్రమంగా వృత్తిగా పరిణామం చెందింది. ఇపుడు జర్నలిజం కూడా అన్నింటిలానే ఫక్తు వ్యాపారంగా మారిపోయింది' అని పేర్కొంది. నిజానికి మీడియా నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తూ వార్తలు, విశ్లేషణలు అందిస్తూ ప్రజాస్వామ్యానికి వాచ్ డాగ్ గా వ్యవహరించాల్సి ఉంది. వీటిలో ఏ ఒక్కదాన్ని మీడియా విస్మరించినా ప్రజాస్వామ్యానికి తీవ్రమైన నష్టం తలపెట్టినదవుతుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వార్తలు ప్రచురించేందుకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలను ప్రసారం చేసేందుకు వివిధ రాజకీయ పక్షాల నుండి, నాయకుల నుండి డబ్బు తీసుకున్నాయి. ఈ విషయాన్నికేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో ధృవీకరించారు. పత్రికలు, టీవీ ఛానళ్లు తమ ఆర్ధిక అవసరాలు తీర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాల, నేతల పనితీరును మదింపుచేసి గ్రేడ్ లు కేటాయించే సంస్కృతికి శ్రీకారం చుట్టాయి. ఈ పద్ధతిలో ఇరు పక్షాలు లబ్ధి పొందుతుండటం విశేషం. ఇదే సిద్ధాంతాన్ని మీడియా ప్రజలకు కూడా వర్తింపచేస్తే ఇక ప్రజాస్వామ్యం కలుషితం కాక తప్పదు.
ఇక ప్రజాస్వామ్య వ్యవస్థలో మరో కీలక విభాగం ఆర్మీ. భారత ఆర్మీలో 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' మంజూరు ఉదంతంలో ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరు దేశానికి మాయని మచ్చనే తెచ్చింది. ఒక భవన నిర్మాణం విషయంలో అడ్డగోలుగా ఆర్మీ తరఫున నిరభ్యంతర పత్రాన్ని మంజూరు చేసిన దుశ్చర్యలో ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్ సహా నలుగురు జనరల్ ర్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉండటం యావద్దేశ ప్రజానీకానికి కూడా ఆశ్చర్యం కలిగించింది. ఈ వ్యవహారం బయటపడి ఆర్మీ కోర్టును సంప్రతించింది. ఈ కేసు విషయంలో లోతుగా విచారణ జరిపి బాధ్యులైన వారిని శిక్షించే దశకు కోర్టు విచారణ చేరుకోనేలేదు. ఇంతలోనే ఒక ఎలక్ట్రానిక్ మీడియా రంగ ప్రవేశం చేసి విచారణ సాగుతున్న అంశాన్ని దేశవ్యాప్తంగా సంచలనం చేసేసింది. అభియోగం ఎదుర్కొంటున్న అధికారి ఆర్మీ చీఫ్ కు బాగా సన్నిహితుడని దేశవ్యాప్తంగా ప్రచారం సాగించింది. ఒక కేసు విషయంలో తీర్పు వచ్చేందుకు దశాబ్దాల సమయం పట్టే దేశ వ్యవస్థలో కోర్టుల విచారణ, సాక్ష్యాధారాల సేకరణ, మిలటరీ ప్రామాణిక క్రమశిక్షణలతో పని లేకుండా మీడియా ఇలా దూకుడుగా వ్యవహరించడం వల్ల అసలుకే మోసం వస్తోంది. ఈ కేసు విషయంలో రెండు అంశాలు మాత్రం సుస్పష్టం. ఆర్మీలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు అవినీతి ఆరోపణల కేసులు రోజురోజుకీ మరింతగా పెరిగిపోతుండటం.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|