|
|
Articles: TP Features | ధిక్కారమున్ సైతునా... - Site Administrator
| |
(ఎ.రామలింగేశ్వరరావు)
ముంబాయికి చెందిన ఇద్దరు స్త్రీలు ఇటీవల వారి వ్యక్తిగత తగాదాకు సంబంధించి ముంబయి హైకోర్టు న్యాయమూర్తులపై చర్య తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. ఆ కేసులో పేర్కొన్న అంశాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉండడంతో ఉపసంహరించుకోమని సుప్రీంకోర్టు వారికి సలహా ఇచ్చినా వారు నిరాకరించారు. కేసులో హైకోర్టు న్యాయమూర్తులపై చేసిన వ్యాఖ్యలు, ఇతర వ్యాఖ్యలపై వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టారు. ఆ కేసు విచారణ సందర్భంగా, ఆ ఇద్దరు స్త్రీలలో ఒకరు, ధర్మాసనంలోని ఒక న్యాయమూర్తిపై దుర్భాషలాడుతూ చెప్పువిసరారు. దానిపై న్యాయమూర్తి వారిని తక్షణం అదుపులోకి తీసుకోమని కోరుతూ శిక్ష విధించడానికి ఉద్యుక్తులయ్యారు. తోటి న్యాయమూర్తి దానికి అభ్యంతరం చెప్పి, తక్షణ అరెస్ట్ ఆదేశాలు శిక్ష విధించబూనడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని వారికి తగిన అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఆ అభిప్రాయ భేదం వల్ల కేసు ముగ్గురు న్యాయమూర్తుల దగ్గరకు రాగా, కోర్టులు నాలుగు గోడల మధ్య న్యాయమూర్తులు, న్యాయవాదుల సమక్షంలో జరిగిన ధిక్కరణకి తక్షణం తగిన శిక్ష విధించే అధికారం న్యాయస్థానానికి ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఆ స్త్రీలకు తదనుగుణంగా శిక్ష విధించారు. న్యాయస్థానికి ఈ విధమైన అధికారం లేనప్పుడు న్యాయస్థానంపై ప్రజల విశ్వాసం సన్నగిల్లడమే కాకుండా గౌరవం కూడా పోతుంది. అందుకే కోర్టు ధిక్కరణకు శిక్ష విధించే అధికారం న్యాయస్థానానికి సంక్రమించింది.
1773లోని రెగ్యులేషన్ చట్టం ద్వారా సుప్రీంకోర్టును కలకత్తాలో ఏర్పాటు చేసినపుడు, 1861లో కలకత్తా, బొంబాయి, మద్రాసు పట్టణాల్లో హైకోర్టులు ఏర్పాటు చేసినపుడు, ఇంగ్లండులో అమలులో ఉన్న కోర్టు ధిక్కరణకు వ్యతిరేకంగా ఆచారంగా వస్తున్న న్యాయాన్ని అమలు చేశారు. 1926లో కోర్టు ధిక్కరణ చట్టాన్ని మన దేశంలో ప్రవేశపెట్టారు. దీన్ని 1937లో సవరించారు. దీనివల్ల హైకోర్టుల్లోనే కాకుండా దాని పరిధిలోని కోర్టుల ధిక్కరణ విషయంలో కూడా చర్య తీసుకునే అధికారం వచ్చింది. 1950లో మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత, 129వ అధికరణ ద్వారా సుప్రీంకోర్టు 215వ అధికరణం ద్వారా హైకోర్టులు, రికార్డులు భద్రపరచి కోర్టును ధిక్కరించే పరిస్థితుల్లో శిక్ష విధించే అధికారం గల న్యాయస్థానాలుగా గుర్తింపు పొందాయి. 1952లో వేరొక చట్టాన్ని చేస్తూ 1926వ చట్టాన్ని రద్దుచేశారు. దీనివల్ల ఎవరైనా వ్యక్తే కోర్టు ధిక్కరణకు ఎక్కడ పాల్పడినా, అతను కోర్టు పరిధిలో లేకపోయినా శిక్షించే అధికారం వచ్చింది. 1961లో కోర్టు ధిక్కరణ చట్టాన్ని సమీక్షించడానికి ఒక కమిటీని నియమించగా, దాని నివేదిక ఆధారంగా 1971లో ఒక సమగ్ర చట్టం రూపొందించారు.
1971 చట్టంలో 24 సెక్షన్లున్నాయి. సివిల్ ధిక్కరణ, క్రిమినల్ ధిక్కరణలను నిర్వచించారు. హైకోర్టు అంటే ఏమిటో కూడా నిర్వచించారు. క్రింది కోర్టుల విషయంలో జరిగే ధిక్కరణలను విచారించే అధికారం 10వ సెక్షన్ కింద ఇవ్వగా హైకోర్టు, సుప్రీంకోర్టుల విషయంలో జరిగే ధిక్కరణలను విచారించే అధికారం 14వ సెక్షను కింద వచ్చింది. క్రిమినల్ ధిక్కరణలను విచారించే అధికారం ప్రత్యేకంగా 15వ సెక్షన్ క్రింద వచ్చింది. 16వ సెక్షన్ కింద న్యాయమూర్తులు ఏయే సందర్భాల్లో శిక్షార్హులో వివరించారు. అంతేకాకుండా ఏవి ధిక్కరణ కిందకు రావో చట్టంలో పేర్కొన్నారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|