|
|
Articles: My Thoughts | వైద్య గురు ధన్వంతరి - Miss rajeswari rajeswarinedunuri
| |
అసలు 'ధన్వంతరి' అంటే 'ధనుశల్యం తస్య అంతం పారం ఇయతి గచ్చతీతి ధన్వంతరి' అని వ్యుత్పత్తి చెప్పడింది. అంటే 'మనస్సుకూ, శరీరానికీ బాధను కలిగించే శల్యములను అనగా దోషాలను, రోగాలను, శరీరం లోపల ఉండే వికృతులను, అఘాతాల వ్రణాలు మొదలైన వాటిని నివారించేవి' అని అర్ధం.
పూర్వం శస్త్ర చికిత్సా కుశలులైన వారిని 'దాన్వంతరీయులు' అని వ్యవహరించడం వాడుకలో ఉండేదట. ఇక ఈ ధన్వంతరీకి నిర్వచనం నాలుగు విధాలుగా చెప్పబడినది. 1. క్షీర సాగర మధనంలో అమృత కలశాన్ని చేపట్టిన శ్రీ మహా విష్ణువు అవతారమని, 2. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం సూర్యుని వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న ధన్వంతరి సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడని, 3. ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం శస్త్ర చికిత్స నేర్పిన 'ధన్వంతరి' అనే బిరుదు గలిగిన కాశీరాజు దేవదాసు అవతారమనీ విశ్వాసము. 4. ఇతడు విక్రమాదిత్యుని ఆస్థాన పండితులలోని నవరత్నాలలో ఒకడని, ధన్వంతరీ నిఘంటువు అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంథాన్ని రచించాడని మరి కొందరి విశ్వాసం.
అంతే కాదు పూర్వ కాలంలో గొప్ప ఆయుర్వేద వైద్యులను 'ధన్వంతరి' అనే బిరుదుతో సత్కరించే వారని, వివిధ ధన్వంతరుల కథలు చరిత్రలో కలగలసి ఉండవచ్చునని కొందరు భావిస్తున్నారు. ఇక పోతే పురాణ గాథ ప్రకారం.. క్షీర సాగర మధనంలో ముందుగా హాలాహలం పిమ్మట కామధేనువు ఉచ్ఛైశ్రవము, ఐరావతము, పారిజాతము, అప్సరసలు అటు పిమ్మట రమాదేవి, ధన్వంతరి అవతరించారని భాగవతం అష్టమ స్కంధంలో వివరించబడింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|