|
|
Articles: Festivals | గణేశ్ మహరాజ్ కీ జై - Site Administrator
| |
హిందువులు ఏ కార్యక్రమం తలపెట్టినా తొలిసారిగా పూజించేది విఘ్నాధిపతి విఘ్నేశ్వరునే. మొట్టమొదటగా మనం స్మరించేది కూడా ఆయన్నే. పూర్ణకుంభం లాంటి ఆ దేహం, బాన వంటి కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, మేధకు సంకేతాలు. వక్రతుండం ఓంకార ప్రణవ నాదానికి ప్రతీక. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఒక చిన్న ఎలుక. అదే ఆత్మలోని చమత్కారం. ఆయన పొట్టను చుట్టి ఉండే నాగం (పాము) శక్తికి సంకేతం. నాలుగు చేతులు మానవాతీత సామర్ధ్యాలకు, తత్వానికి సంకేతం. చేతిలో ఉన్న పాశ, అంకుశాలు బుద్ధి, మనసులను సన్మార్గంలో నడిపించే సాధనాలకు ప్రతీకలు. మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే.
వ్యాస భగవానుడు మహాభారతం రాయాలని సంకల్పించినప్పుడు తన దంతాన్నే విరిచి ఘంటంగా మార్చాడు వినాయకుడు. ఇదంతా విజ్ఞానం కోసం చేయవలసిన కృషికి, త్యాగానికి సంకేతం. మరొక చేతిలో మోదకం - ఉండ్రాయి ఉంటుంది. కొందరి ప్రకారం అది వెలగ కాయ. భక్తులు తక్కిన దేవతల ఎదుట తప్పులు చేసి ఉంటే క్షమించమని చెంపలు వేసుకుంటారు కానీ, వినాయకుని ఎదుట గుంజీలు తీయాలి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, నిగూఢ సంకేతాలు ఉన్న అధినాయకుడే మన వినాయకుడు.
కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువైన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని లోనికి వెళ్ళకుండా అడ్డుకున్నాడు. పరశురాముడు ధిక్కరించడంతో గణేశుడు తన తొండంతో ఆయనను పైకెత్తి పడేశాడు. ఆగ్రహించిన పరశురాముడు తన చేతిలోని గండ్రగొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడి పడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు బయటకు వచ్చారు. నెత్తురోడుతున్న బాలగణపతిని పార్వతి ఎత్తుకొని పరశురాముడిని తీవ్రంగా మందలించింది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నించమని పరశురాముడు వేడుకున్నాడు. ఒక దంతం పోగొట్టుకున్న ఆ నాటి నుంచి గణపతి ఏకదంతుడుగా పేరు పొందాడు.
విఘ్నేశ్వర కథ :
సూత మహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తి, చంద్రదర్శన దోషకారణం దాని నివారణ చెప్పాడు. పూర్వం గజరూపం గల రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీవెల్లప్పుడు నా పొట్టలోనే ఉండాలని కోరాడు. భక్త సులభుడైన పరమేశ్వరుడు ఆతని కోర్కె దీర్చేందుకు గజాసురుని పొట్టలో ప్రవేశించి సుఖంగా ఉన్నాడు.
కైలాసంలో పార్వతీదేవి భర్త జాడ తెలియక అనేత చోట్ల అన్వేషిస్తూ కొంత కాలానికి గజాసురుని గర్భంలో శివుడు ఉన్నట్లు తెలుసుకొని రప్పించుకొనే మార్గం తెలియక పరితపిస్తూ విష్ణుమూర్తిని ప్రార్ధించింది. తన పతి విషయం చెప్పి, 'మహాత్మా! నీవు పూర్వం భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడ ఏదో ఒక ఉపాయంతో నా పతిని రక్షించు' అని విలపించింది. శ్రీహరి పార్వతిని ఊరడించి పంపాడు. హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి, గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే మేవని నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా అలంకరించి, బ్రహ్మాది దేవతల చేత కూడా తలొక వాద్యాన్ని ధరింపజేసి, తానూ చిరుగంటలు, సన్నాయిలు తీసుకొని గజాసుర పురానికి వెళ్ళాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|