|
|
Articles: TP Features | భాజపాను వీడని జిన్నా నీడ! - Site Administrator
| |
(రమణ కుమార్)
స్వాతంత్ర్యానంతరం 62 ఏళ్ళే తర్వాత కూడా రాజకీయ నాయకులు కొందరు - జిన్నా 'భూతం' బారిన పడుతున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు నిన్న అద్వానీ, నేడు జశ్వంత్ సింగ్ జిన్నాను ప్రస్తుతించి, ఇక్కట్ల పాలయ్యారు! పాక్ పర్యటనలో 'జిన్నా దేశ భక్తుడు' అని వ్యాఖ్యానించగా భాజపా అధ్యక్ష పదవిని కోల్పోయిన అద్వానీ చరిత్రను చూసిన తరువాత కూడా 'జిన్నా చరిత్ర' రాయాలని సింగ్ సంకల్పించడం పెద్ద సాహసమే! నియంత హిట్లర్ లో అనేక మంచి లక్షణాలు ఉన్నాయికదా అని, యూదుల వధను మరచి... కీర్తించలేం కదా! పాకిస్థాన్ ఏర్పాటు లక్ష్యంగా 'ప్రత్యక్ష చర్య'కు పిలుపు ఇచ్చిన జిన్నాను, 'పాకిస్థాన్ పిత'గా గుర్తింపు పొందిన ఆయనను భారతీయులు క్షమించగలరా!
జిన్నా 'ప్రత్యక్ష చర్య' పిలుపు కారణంగా పంజాబ్, బెంగాల్ లో వేలాది హిందువులు హత్యకు గురయ్యారు. ఎందరో మానవతుల శీలాన్ని హరించారు. ఆస్తుల లూటీ సరేసరి. విచక్షణ లేకుండా ఊచకోత జరిగింది. ఏర్పాటు వాదుల హింస 'తాండవాని'కి కలకత్తా ప్రాంతంలో జరిగిన సంఘటనలే సాక్షీభూతం. హిందువులు చెల్లా చెదురు అవుతున్న తరుణంలో హిందూమహాసభ రంగ ప్రవేశం చేసిన తరువాత ప్రతిచర్య ప్రారంభమైంది. ముస్లింలపై దాడులు మొదలయ్యాయి. జిన్నా అధికారదాహానికి భారత్ లో వేలాదిగా హిందువులూ, ముస్లింలు మృత్యువాతపడ్డారు.
పాకిస్థాన్ ఏర్పాటుకు జిన్నా పోరాటానికి అవసరమైన అన్ని అండదండలను అప్పటి బ్రిటిష్ నేత చర్చిల్ కల్పించారన్న విషయాన్ని గ్రహించాలి. దండి సత్యాగ్రహంలో ముస్లింలు విరివిగా పాల్గొన్న తరువాత స్వాతంత్ర్యోద్యమం నుంచి జిన్నా 'తెర మరుగు' అయ్యారు. మూటాముల్లె కట్టుకొని ఇగ్లాండ్ పోయి బ్రిటిష్ మహారాణికి న్యాయవాదిగా కొలువులో చేరారు. అక్కడ ఆయన కాలక్షేపం చేస్తున్న తరుణంలో భారత్ లో మహాత్మాగాంధీ ప్రభ బాగా వెలుగుతోంది. మహాత్ముని ప్రాభవానికి కలవరపడిన ముస్లిం ఛాందసవాద వర్గాలు జిన్నాను తిరిగి భారత్ రావాలని వేడుకున్నాయి... అలా తిరిగొచ్చిన జిన్నా తనకంటూ సొంత రాజకీయ సామ్రాజ్యాన్ని నెలకొల్పుకున్నారు. ముస్లిం లీగ్ కు 'మకుటం లేని మహారాజు'గా వెలుగొందారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|