|
|
Articles: My Thoughts | పెంచితే ... తుంచలేం! - Site Administrator
| |
మరోవైపు సుప్రీమ్ కోర్టు ఇచ్చిన మరో తీర్పు ప్రజల చెట్ల పెంపకం అలవాటుమీద నీళ్ళు చల్లుతున్నది. ఐదు హెక్టార్ల విస్తీర్ణం మించిన ప్రదేశంలో చెట్లు ఉంటే అది అడవికిందికి వస్తుందని కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఆ తీర్పు చెట్లను, అడవులను రక్షించడానికి ఒకవైపు పనికొస్తే మరోవైపు మరెవరూ తమ భూములలో భారీగా చెట్ల పెంపకాన్ని చేపట్టనివ్వటం లేదు. చెట్లను పెంచి, వాటిమీదే కాక ఆ భూమిమీద కూడా హక్కు కోల్పోవటం ఎందుకు అనుకుని చెట్లు పెంచటమే మానేస్తున్నారు.
చెప్ల పెంపకం అవసరం. పర్యావరణ పరిరక్షణ మరింత అవసరం. కాని చెట్ల సంఖ్య తగ్గుతున్నది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 33 శాతం అటవీ భూమివున్న మనదేశంలో ఇప్పుడు 15 శాతం కన్నా తక్కువ. కొన్ని రాష్ట్రాలలో మరీ తక్కువ. అసలు ఈ అడవుల విస్తీర్ణం తగ్గటానికి, మన రాష్ట్రాలలోని అటవీ శాఖ అధికార్ల సంఖ్య అటవీ చట్టాలు పెరగటానికి సంబంధం వుంది. అటవీ శాఖ సిబ్బంది పెరుగుతున్న కొద్దీ అడవులు తగ్గి పోతున్నాయి.
చెట్ల పెంపకం ధర్మబద్ధంగా ప్రజలు చేపట్టినంతకాలం అడవులు పచ్చగా వున్నాయి. చట్టాలతో నియంత్రించాలనుకున్న తర్వాత అడవులే కాదు చెట్లూ మాయమవుతున్నాయి. లాభపడుతున్నది అటవీ శాఖ సిబ్బంది మాత్రమే. ఇప్పటికైనా పర్యావరణ పరిరక్షణ చేయడం చట్టాలతో సాధ్యం కాదని, ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే సాధ్యమని గుర్తించటం అవసరం.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
![](../images/spacer.gif) |
Advertisements |
|
![](../images/spacer.gif) |
![](../images/spacer.gif) |
Advertisements |
|