|
|
Articles: My Thoughts | వైద్య గురు ధన్వంతరి - Miss rajeswari rajeswarinedunuri
| |
ఇతడు క్రీస్తు పూర్వం 3000 వేల కాలానికి చెందిన వాడని ఒక అభిప్రాయము. ఇక ధన్వంతరీ ఆలయాలు ప్రత్యేకంగా కనుపించవు. వారణాసిలోని సంస్కృత విద్యాలయము మ్యూజియములో ఒక ధన్వంతరీ విగ్రహము ఉందట. ఢిల్లీలో ఆయుర్వేద సిద్ధ పరిశోధనా మండలి కేంద్రంలో ఒక పెద్ద, ఒక చిన్న ధన్వంతరీ విగ్రహాలు ఉన్నాయట. ఇక పోతే తమిళనాడులో శ్రీ రంగస్వామి ఆలయ ఆవరణలో ఒక ధన్వంతరీ మందిరంలో నిత్య పూజలు జరుగుతాయి. అచ్చటి శిలాపలకం మీద 12వ శతాబ్ధానికి చెందినట్లుగా అప్పటి గొప్ప ఆయుర్వేద వైద్యుడు గరుడ వాహన భట్టార్ యొక్క విగ్రహాన్ని ఈ మందిరంలో ప్రతిష్టించినట్టుగా తెలియబడుతున్నది. అక్కడ తీర్ధంగా కొన్ని మూలికల రసాయనం (కషాయం) ఇస్తారట.
ఇక కేరళలో వెల్లువాయి అనే గ్రామంలో ఒక ధన్వంతరి గుడి ఉంది. అధికంగా జనాదరణ పొందుతున్న ధన్వంతరీ క్షేత్రం కేరళలోనే కాలికట్ పట్టణ పరిసరాలలోనే మరొకటి ఉంది. వ్యాధి నివారణకి ఆరోగ్యానికి ఇక్కడ దేవుని దర్శించి ప్రార్ధనలు చేస్తూ ఉంటారు. కేరళలో చాలా చోట్ల అష్ట వైద్య విధానాన్ని అనుసరించి చాలా కుటుంబాలు ధన్వంతరిని పూజిస్తూ ఉంటారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా 'చింతలూరు' అనే గ్రామంలో ప్రసిద్ధమైన ధన్వంతరీ దేవాలయం ఉంది.
ధన త్రయోదశి అంటే దీపావళికి రెండు రోజులు ముందుగా చేసే వ్రతాన్ని ధన్వంతరీ వ్రతం అంటారు. దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపు కుంటారు. ఈ ధన్వంతరీ కాశీ రాజు దివో దాస ధన్వంతరికి ముత్తాత అయి ఉండాలి. కాశీ రాజు దివోదాస ధన్వంతరీ ఆయుర్వేద గ్రంథాలు ఏవైనా ముఖ్యంగా శల్య శలాక్య తంత్రాల గురించి రాసాడో లేదో తెలియదు గాని బహుశ 'చికిత్స తత్వవిజ్ఞానము చికిత్సా దర్శనము' అనే గ్రంథాలు ధన్వంతరీ దివోదాస రచనలు అని ప్రతీతి. 'చికిత్సా కౌముది' అనేది కాశీ రాజు రచన అయి ఉండవచ్చునని ఒక అభిప్రాయము. ఇక 'శుశ్రుత సంహిత' (శుశ్రుతుడు రచించిన) అనే గ్రంథాన్ని బట్టి ఆ కాలంలో శాస్త్రీయ విధానాలు స్పష్టంగా నెలకొన్నట్లు విదిత మవుతోంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
![](../images/spacer.gif) |
Advertisements |
|
![](../images/spacer.gif) |
![](../images/spacer.gif) |
Advertisements |
|