|
|
Articles: Festivals | గణేశ్ మహరాజ్ కీ జై - Site Administrator
| |
వినాయకుని ఆధిపత్యం :
ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని సేవిస్తూ విఘ్నాలకు ఒకరిని అధిపతిగా తమకు ఇవ్వాలని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడు కనుక ఆ ఆధిపత్యం తన ఇవ్వాలని, 'గజాననుడు మరుగుజ్జు, అనర్హుడు, అసమర్ధుడు గనుక ఆధిపత్యం తనకే కావాలని' కుమారస్వామి తండ్రిని వేడుకొన్నారు.
'మీలో ఎవ్వరు ముల్లోకాల్లోని పుణ్య నదుల్లో స్నానంచేసి ముందుగా నా ముందుకు వస్తారో, వారికే ఆధిపత్యం ఇస్తా'నని చెప్పాడు. దీనికి సమ్మతించి కుమారస్వామి నెమలి వాహహనం ఎక్కి వాయు వేగంతో వెళ్ళాడు. అంత గజాననుడు చిన్నబోయి, తండ్రి దగ్గరకు వెళ్ళి, ప్రణామం చేసి 'అయ్యా! నా అసమర్ధత తెలిసి కూడా ఇలా చెప్పడం భావ్యమా! మీ పాద సేవకుడను. నన్ను కటాక్షించి ఉపాయం చెప్పి రక్షించు' అని ప్రార్ధించాడు. మహేశ్వరుడు దయాళుడై, 'సకృత్ నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్ప శతత్రయం గంగాది సర్వ తీర్దేషు స్నాతో భవతి పుత్రక ' - కుమారా! ఒకసారి 'నారాయణ మంత్రం పటించు' అనగా, గజాననుడు సంతసించి, అత్యంత భక్తితో ఆ మంత్రం జపిస్తూ కైలాసంలో ఉన్నాడు.
మంత్ర ప్రభావంతో అంతకు పూర్వం గంగానదికి స్నానానికి వెళ్ళిన కుమారస్వామికి గజాననుడు నదిలో స్నానమాడి ఎదురుగా వస్తున్నట్లు కనిపించింది. ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలోనూ అలాగే చూచి కుమారస్వామి ఆశ్చర్యపోయాడు. కైలాసానికి తిరిగి వచ్చి తండ్రి సమీపంలో ఉన్న గజాననుని చూసి, నమస్కరించి, తన బలాన్ని నిందించుకుని, 'తండ్రీ! అన్నగారి మహిమ తెలియక అలా అన్నాను, క్షమించు. ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండ' ని ప్రార్ధించాడు.
అనంతరం భాద్రపద శుద్ధ చతుర్ధి నాడు గజాననునికి విఘ్నాధిపత్యాన్ని శివుడు ఇచ్చాడు. ఆనాడు అన్ని దేశాల వారూ విఘ్నేశ్వరునికి తమ శక్తి కొద్దీ కుడుములు, అపూపములు తదితర పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషించి కుడుములు ఇతర పదార్థాలు తిని, కొన్ని వాహనానికి పెట్టి, కొన్ని చేతిలో పట్టుకొని మెల్లగా సూర్యాస్తమయం వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. పొట్ట భూమికి ఆనితే చేతులు భూమికి అందడంలేదు. బలవంతంబగా చేతులానిస్తే కాళ్ళు ఆకాశాన్ని జూస్తున్నాయి. ఇలా దండప్రణామం చేయడానికి వినాయకుడు ఎంతో శ్రమపడుతుండగా, శివుని శిరస్సుపైన ఉన్న చంద్రుడు చూసి వికటంగా నవ్వాడు. రాజు దృష్టి సోకితే రాళ్లు కూడా నుగ్గవుతాయన్న సామెత నిజమైననట్లు విఘ్నదేవుని పొట్ట పగిలి, అందులోని కుడుములు బయటపడ్డాయి. వినాయకుడు కూడా మరణించాడు. పార్వతి శోకిస్తూ చంద్రుని జూచి, 'పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు. కనుక నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు' అని శపించించింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|