|
|
Articles: My Thoughts | శ్రీశ్రీ తెలుగుల సిరి - Site Administrator
| |
పఠాభి, శ్రీశ్రీ, ఆరుద్ర, దేవులపల్లి కృష్ణశాస్త్రి, చలం, చల్లా రాధాకృష్ణశర్మ, నేను - మేమందరం ఆంధ్రులమైనా పర రాష్ట్రాలలో ప్రవాసం చెయ్యాల్సి వచ్చింది. నేను 1975 ప్రాంతాలలో 'ప్రవాసాంధ్ర భారతి' అనే సంస్థను స్థాపించి అనేక కార్యక్రమాలను జరపడమే కాకుండా 'పఠాభి పన్ చాంగం', రాజగోపాల్ ర్యాలిగారి 'సెమ్యాంటిక్ అనాలిసిస్ ఆఫ్ తెలుగు కిన్ షిప్ టెర్మ్స్' లాంటి పుస్తకాలు ప్రచురించాను. 'తెలుగు కోయిల' అనే బులెటిన్ ప్రచురించే వాడిని. 'ప్రవాసాంధ్ర భారతి'కి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు అధ్యక్షులు, పఠాభి గారు ఉపాధ్యక్షులు, నేను కార్యదర్శిని, ఈ సంస్థలో శ్రీశ్రీ కూడా కర్నాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తీసుకువెళ్ళి నేను 'సాహిత్య యాత్ర' చేయించాను.ఈ యాత్రవల్ల శ్రీశ్రీ ఒక వ్యక్తిగా ఎంత ఆత్మీయుడో, ఆయనది పసిపిల్లల మనస్తత్వమనడం ఎంత నిజమై మాటో తెలిసివచ్చింది.
శ్రీశ్రీతో పరిచయం వల్ల ఎన్నెన్ని విషయాలు తెలుసుకున్నానో చెప్తుంటే అదో ధారావాహిక అవుతుంది. శ్రీశ్రీతో పరిచయం ఉన్న అందరివీ ఇలాంటి అనుభవాలే. రోజుకో పుస్తకం చదివెయ్యాలన్నది శ్రీశ్రీ ఆశయమూ అలవాటుగా ఉండేది.చాలా ఏళ్ళ తర్వాత నేను శ్రీశ్రీని బెంగులూరులో పఠాబిగారించికి పిలుచుకువెళ్లాను. 'బాగున్నారా' అని ఒక్కమాట మాత్రం మాట్లాడిన శ్రీశ్రీ పక్కనే పుస్తకాల దొంతరలోంచి ఒక పుస్తకం తీసుకొని చదటం మొదలెట్టాడు.అక్కడున్నంతసేపు ఆ పుస్తకంలోనే మునిగిపోయిన శ్రీశ్రీని చూస్తే ఆశ్చర్యం కలిగింది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
![](../images/spacer.gif) |
Advertisements |
|
![](../images/spacer.gif) |
![](../images/spacer.gif) |
Advertisements |
|