|
|
Articles: TP Features | పెరుగుతున్న అసహనం - Site Administrator
| |
అయితే, స్వాతంత్ర్యోద్యమం చివరి ఘట్టంలో మాత్రమే మహాత్మా గాంధి నిర్ణయంలో పొరపాటు దొర్లింది. ఒక వైపు జిన్నా, మరొక వైపు అంబేద్కర్ వంటి నాయకుల వ్యక్తిగత ఆశయాలను, చారిత్రక శక్తులను ఆయన గమనించలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ దళితులను హిందువులలో భాగం చేసినప్పటికీ స్వతంత్ర భారతంలో దళితులకు న్యాయమైన స్థానం లభించకపోవచ్చునని అంబేద్కర్ భావించారు. తరతరాల అగ్రవర్ణాల అహంకారం దుష్ప్రభావాన్ని చూపింది. మరొకవైపు స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత దేశ పాలనలో మైనారిటీలకు తగినంత ప్రాతినిధ్యాన్ని కాంగ్రెస్ కల్పించకపోవచ్చునని జిన్నా కూడా గ్రహించారు. 1935లో కాంగ్రెస్ చేసిన దారుణమైన పొరపాటు ఆ పార్టీపై ముస్లిం నాయకుల విశ్వాసాన్ని దెబ్బ తీసింది. ఉత్తర ప్రదేశ్ లో ముస్లిం లీగ్ తో కలసి ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ లీగ్ లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
పాకిస్తాన్ సృష్టి కోసం తాను పిలుపు ఇచ్చిన తరువాత సంభవించిన పరిణామాలను జిన్నా ఊహించి ఉండరు. ఆ తరువాత ప్రజ్వరిల్లే మత కల్లోలం తీవ్రతను ఆయన గ్రహించలేదు. తనను అలక్ష్యం చేశారని, కాంగ్రెస్ పార్టీలో తనకు సరైన స్థానాన్ని కల్పించలేదని ఆయన భావించారు. సాధ్యమైనంత త్వరలో, ఏ విధంగానైనా స్వాతంత్ర్యాన్ని సాధించాలన్న కాంగ్రెస్ వాదుల అత్యాశ కారణంగా మహాత్మా గాంధీకి పార్టీపై పట్టు పోయింది. జిన్నా సమాన హోదా కోరుకున్నారు. కాని తరువాత చోటుచేసుకున్న పరిణామాలలో జిన్నాకు స్థానం లేకపోయింది. ఆగస్టు 11న పాకిస్తాన్ రాజ్యాంగ సభలో జిన్నా చేసిన ప్రసంగం చిత్తశుద్ధితో కూడుకున్నదనే అభిప్రాయం కొన్ని వర్గాలలో ఉన్నది. పాకిస్తాన్ కేవలం ఒక దేశంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. కాని ఆయన తన ప్రసంగం ద్వారా సూచించిన కారణానికి, పాకిస్తాన్ ఏర్పాటుకు పేర్కొన్న కారణానికి మధ్య తేడా ఉంది. అయితే, అదంతా చరిత్ర.
మనం మన చరిత్రను పునరవలోకనం చేసుకుని, అటువంటి విచ్ఛిన్నకర, అసహన శక్తులను అడ్డుకోలేమా? మనం అలా చేయకపోతే, మనం స్వల్ప స్థాయిలో అంతర్యుద్ధాలు ఎదుర్కోవలసి రావచ్చు. అంతర్యుద్ధాన్ని సైన్యం ఎన్నటికీ అదుపు చేయజాలదు. శత్రు దేశంతో పోరుకు మాత్రమే సైన్యం ఉపయోగపడుతుంది. మన సొంత పౌరులపై సైనిక చర్యలకు పూనుకోజాలరు. ఇక అంతర్యుద్ధాన్ని అదుపు చేసే విషయంలో పోలీసు బలగం ఏమాత్రం సరిపోదు. అందువల్ల ప్రాంతీయవాదానికి ఆజ్యం పోసే, భాషల ప్రాతిపదికపై చీలికలు సృష్టించే ఈ పెడసరపు ధోరణిని మన రాజకీయ నాయకులు విడనాడవలసి ఉంటుంది. అలా జరగనట్లయితే, ఏదో ఒక రోజు మన దేశం భారీ మూల్యాన్నే చెల్లించుకోవలసి ఉంటుంది. రాజ్యాంగంలో నిర్వచించిన స్వతంత్ర భారత సౌధమే కుప్పకూలిపోతుంది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|