|
|
Articles: Short Stories | యోగం - Mr. Satyam Mandapati
| |
మీరేమయినా అనండి. మీ మూఢనమ్మకాలతో అలాంటి విషకీటకాలను ఇంట్లో వుంచడం మంచిది కాదు.సాయంత్రంలోగా ఆ పందిరి కింద తవ్వదలుచుకున్నాను. పాము కనబడిందో చంపటమో, పట్టుకుపోవడమో చేస్తాను లేదా - పాము లేదని రూఢి చేసుకుని, ఆగుంటలు పూడ్చివేస్తాను' అంటూ లోపలికి వెళ్ళిపోయాడు శ్రీరాం.
అప్పటిదాకా ఈ కథ చదివిన రమేష్ నిట్టూర్చి తల ఎత్తాడు.
ఓ.కే. సూర్యం - ఈ కథ ఇక్కడిదాకా బాగానే రాశావ్. మరి దీన్నెలా ముగిద్దామనుకుంటున్నావ్?
కిటికీ దగ్గర రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నుంచున్న సూర్యం వెనక్కి తిరిగాడు
రమేష్ నువ్వు కూడా రచయితవే - నువ్వు చెప్పు ఈ కథను ఎలా ముగించవచ్చో!
రమేష్ - ఒక క్షణం ఆలోచించి అన్నాడు. 'సూర్యం యిలాంటి కథలకు రచయిత యిచ్చే ముగింపు సమాజం మీద అంతో ఇంతో ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఎంత వినోదంగా రాసినా, ఉబుసుపోక రాసినా, విజ్ఞానం కోసం రాసినా రచయిత సమాజానికి న్యాయం కానీ, అన్యాయం కానీ కథల ముగింపుల్లోనే చేస్తాడు. ఈ కథనే తీసుకుందాం. రచయిత మూఢనమ్మకాల పుట్ట అనుకుందాం. అలాంటివాడు ఈ కథను ఎలా ముగింపు చేస్తాడు? ఈ కథను మూడు రకాలుగా ఆ మూఢ రచయిత ముగించడానికి అవకాశం వుంది. ఒకటి - శ్రీరాంకి పాము దొరకలేదు. అలాంటి పాపానికి ఒడికట్టిన శ్రీరాంకి, దైవాంశగల పాము ఎలా కనపడుతుంది' అన్నది జానకమ్మ. తర్వాత రాజు పెద్దవాడై ఐ.ఎ.ఎస్ పరీక్ష పాసయ్యాడు. కలెక్టరయాడు. 'మంచి యోగం వుంది రాజుకి' అన్న మాట నిరూపించాడు. ఇది ఒక ముగింపు లేదా - శ్రీరాంకి పాము దొరికింది, కర్రతో బాది చంపేశాడు. శ్రీరాంకి కళ్లు పోయాయి. పాలేరు చెప్పినప్పుడు ఎగతాళి చేసిన శ్రీరాం తర్వాత పశ్చాత్తాప పడ్డాడు. సుబ్రమణ్యస్వామికి నమస్కారం పెట్టుకుని భోరుమని ఏడ్చాడు. ఇది ఇంకో ముగింపు. ఇక మూడో ముగింపు. అక్కడ తవ్వేటప్పుడే పాము బుసలుకొడుతూ పైకిలేచి శ్రీరాంనే కాటు వేసింది. అలా అతని పాపానికి ప్రాయశ్చిత్తం అయింది.
'అవును రమేష్ రచయితల ఇలా వ్రాస్తే సమాజం ముందుకు పోకపోగా, రోజురోజుకీ వెనకపడటమే కాకుండా, ఇంకా వెనక్కి వెడుతూవుంటుంది! కాని అసలు జరిగిన కథ ఏమిటో తెలుసా నీకు!'
ఏమిటి ఈ కథ నిజంగా జరిగిందా? అడిగాడు రమేష్.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|