|
|
Articles: TP Features | ప్రాకృతంలో 'తెలుగు' నాడి - Site Administrator
| |
చారిత్రక సాక్ష్యాలతో పరిశీలించి చూస్తే రెండు మూడు వేల ఏళ్ళ క్రితం నుండి ప్రాకృతం రెండు మూడు ఆదిమ మతాలకు బాసటగా నిలిచింది. గొప్పదైన సాహిత్యానికి జన్మనిచ్చింది. భారతదేశమంతా ప్రాకృతం పరిమళించింది. ఆ పరిమళాలు జనజీవన గాధలై విస్తరించాయి.
ప్రాకృత భాషా పరిమళాలు అన్ని రకాల ప్రజలను అలరించాయి. వర్గం, కులాల ప్రసక్తి లేకుండా పాలకులు, పాలితులు అనే భేదం లేకుండా స్త్రీల భాష, పురుషుల భాష అనే తేడా లేకుండా వర్ధిల్లింది. ప్రాకృత భాష ఆయా ప్రాంతాలను, దేశాల అవసరాలను బట్టి అభివృద్ధి చెందింది. ఆయా రాష్ట్రాలలో ఆయా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ అభివృద్ధి చెందుతూ వచ్చింది. అందుకే ప్రాకృతం ఆయా దేశాల పేరుని బట్టి గుర్తించే స్థితికి చేరింది. అందుకే ప్రాకృత వ్యాకరణ కర్తలు మాగధి, శౌరసేని, అర్ధమాగధి, అపభ్రంశం, పైశాచీ, సంస్కృతం అనే ఆరు భాషలు ఉన్నాయని అన్నారు. కొందరు పండితులు భూత భాష వేరేనని అన్నారు. ఏది ఏమైనా ఆనాడు జీవించి ఉన్న కొండకోనలు, లోతట్టు గ్రామీణ ప్రాంతాలు, వివిధ భౌగోళిక పరిధుల్లో జీవించే రకరకాల సమూహాలు ఎన్నో ఉన్నాయి. వీరు మాట్లాడే భాషలను పై విధంగా వింగడించారు.
పై ఆరు భాషల్లో అర్ధమాగధి భాషకు, పైశాచీ భాషకు, అపభ్రంశ భాషకు, మహారాష్ట్ర భాషకు ఎక్కువ పాళ్ళలో సాహిత్యం కనిపిస్తుంది. అయితే ఈ ఆరు భాషలే రానురాను అష్టాదశ (పద్దెనిమిది) భాషలుగా పరిణమించినట్లు తెలుస్తున్నది. ఎలాగంటే - వాత్సాయనుడు వంటివారు చతుష్షష్టి కళలలో దేశభాషా విజ్ఞానాన్ని ఒక కళగా గుర్తించాడు. కౌటిల్యుడు రాజులకు, మంత్రులకే కాదు గూఢచారులకు దేశీభాష విజ్ఞానం అవసరం అన్నాడు. అంటే పద్దెనిమిది భాషలలో పరిజ్ఞానం అవసరం. ఈ భాషలు రాకపోతే ఆ భాషీయ సమూహాలను పరిపాలించడం రాజుకు సాధ్యం కాదు. రహస్యంగా తిరుగాడుతూ సమాచారాన్ని సేకరించే గూఢచారులకు అన్ని రకాల ప్రాకృత భాషలు వచ్చి ఉండాలని లేని పక్షంలో రాజుగారికి సమాచారం అందజేయడంలో విఫలం అవుతారని భావించాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|