|
|
Articles: My Thoughts | ఆ మనసుకు కళ్ళుంటే! - Site Administrator
| |
1987లో కేంద్ర సాహిత్య అకాడమీ ఆంధ్రప్రదేశ్ లో గిరిజనుల కథలను ఆంగ్లంలో సంకలనం చేయవలసిందిగా కోరింది. సాధారణంగా సాహిత్యవేత్తలే ఈ సంకలనాలను ఇంతవరకు సమకూర్చారు. కాని గిరిజనుల సాహిత్యంలో దొర్లే పక్షులు, జంతువులు, చెట్ల శాస్త్రీయ(వ్యవహార) నామాలను ఇస్తూ కథలకు పుష్ఠినివ్వాలని నా కోరిక.
వన్యప్రాణప్రేమికుల రచనల స్థాయిలో నిలబడాలంటే మరింత సమాచారం సేకరించాలని కూడా అర్థమైంది. అటువంటి రచన మాత్రమే గిరిజనులను వారి సరసన నిలబెట్టగలవు. ఈ కృషికి పనికివచ్చే సమానార్ధక పర్యాయపదకోశాలను మనం తయారు చేసుకోలేదు. అప్పట్లో వాటిని తయారుచేసుకోగల తీరిక నాకు లేదు. వచ్చిన అవకాశం అందుకోలేకపోయినా, 1991లో సిద్ధాంత గ్రంథం 'తెలుగు గిరిజన గీతాలు' అచ్చు వేయగలిగాను.
1992లో పాడేరులో ఒక సమావేశానికి 'సమత' రవి ఆహ్వానించారు. విశాఖమన్యం సంస్కృతిపై సాగిన నా ప్రసంగాన్ని ఆనాటి ప్రాజెక్ట్ ఆఫీసర్ సోమేశ్ కుమార్ (తరువాత అనంతపురం జిల్లా కలెక్టర్) ఆసాంతం విన్నారు. 'తెలుగు గిరిజన గీతాలు' 200 కాపీలు కొన్నారు. అప్పటికే వారితో పాత్రికేయుడు బి.వి.రమణ పనిచేస్తున్నారు. అరకులోయలో మ్యూజియంను అభివృద్ధి చేస్తున్నారు. నన్నుకూడా అపుడపుడు వచ్చి తమ కృషిలో పాలుపంచుకొమ్మన్నారు. కాని అప్పుటే మా కార్యక్రమాలను తూర్పుగోదావరి నుండి పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాలలకు విస్తరించాం. 1/70 మొత్తం గ్రామాలకీ వర్తించకుండా నిలుపుదల చేస్తూ కోర్టు ఉత్తర్వులు తెస్తున్న భూస్వాముల ఆగడాలకు అడ్డుకట్ట వేశాం.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|