|
|
Articles: My Thoughts | మాతృభాషకు దిక్కెవరు? - Site Administrator
| |
సాయంత్రమయ్యింది. పదివ తరగతి విద్యార్థులు... ఆ నలుగురినీ రప్పించి... పాఠశాల ఆఖరుగంట (లాంగ్ బెల్) మోగించమన్నాడు. ఉపాధ్యాయులందర్నీ ప్రధానోపాధ్యాయుడితో సహా సమావేశపరచాడు ఒక తరగతిగదిలో. తెలుగుపండితుడిని పిలిచి, ఆ నాలుగు పుస్తకాలూ అతని చేతికిచ్చి పచ్చ సిరాతో గీతలు పెట్టిన పదాలను నల్లబల్లపై సుద్దముక్కతో రాయించాడు. ఆ నలుగురు విద్యార్థులూ భయంభయంగా చేతులు కట్టుకొని నల్లబల్లకెదురుగా నిలబడ్డారు. అంతా నిశ్శబ్దం.... నల్లబల్ల చూసిన ఉపాధ్యాయులందరికీ విషయం తెలిసిపోయింది... తెలుగు ఉపాధ్యాయుడి పనైపోయిందనుకున్నారందరూ.
'విద్యార్థులతో నల్లబలపై వరుస నాలుగు మాటలను చదివించండి' విద్యాశాఖాధికారి.
'నేను చెప్పిన విషాద సంఘటనను మరొక్క సారి చెబుతా. గుర్తుకు తెచ్చుకొని, ధైర్యంగా, ఎవరు వ్రాసింది వారు చదవండి' అన్నాడు ధైర్యంగా తెలుగు ఉపాధ్యాయుడు.
1. 'బాధగా ఉంది' అని చదివాడు మొదటి విద్యార్థి ధనుంజయరావు
2. 'బాదగా ఉంది' అని చదివాడు రెండవ విద్యార్థి బాలకృష్ణ.
3. 'భాదగా' అన్నాడు భాస్కరరావు
4. 'భాధగా ఉంది' అని బెక్కిబెక్కి (వెక్కివెక్కి) ఏడుస్తూ చదివింది భానుధనలక్ష్మి.
ధనుంజయ ముఖంలో ఏ కవళికలూ లేవు. బాలకృష్ణ ముఖంలో దు:ఖం ద్యోతకమయ్యింది. భాస్కరరావు విచారంగా ఉన్నాడు. భాను ధనలక్ష్మి మాత్రం ఆ విషాద సంఘటనను గుర్తుకుతెచ్చుకొని, విచలించిపోయి కన్నీరుమున్నీరై రోదిస్తోంది. ఈ పరిస్థితి అంతా చూచి మహిళా ఉపాధ్యాయులందరూ చేతిగుడ్డలతో కళ్ళు తుడుచుకున్నారు. మగ ఉపాధ్యాయులందరూ వెక్కివెక్కి ఏడుస్తున్నారు, ప్రధానోపాధ్యాయునితో సహా. విద్యాశాఖాధికారి కంటనీరెట్టుకొని, చకచకా బయటకు నడచి జీపెక్కి వెళ్ళిపోయాడు. అక్కడ నిశ్చేస్టుడై నిలుచుండిపోయింది తెలుగు ఉపాధ్యాయుడొక్కడే. (ఈ కథ కేవలం కల్పితమైనదే కాదు, నా అనుభవాల సారం - ఛాయరాజ్)
పైన తెల్పిన 2, 3, 4 వ్యక్తీకరణలలో విషాద సంఘటనపై భావోద్వేగాలూ, స్పందనలు వివిధ స్థాయిలలో విద్యార్థులలో దృశ్యమానమైనాయి. దోషాలను మించి. ఈ సందర్భంలో తెలుగు భాషోపాధ్యాయుడు విజయుడో, పరాజయుడో ఎలా తేలుతుంది?
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
![](../images/spacer.gif) |
Advertisements |
|
![](../images/spacer.gif) |
![](../images/spacer.gif) |
Advertisements |
|