|
|
Articles: TP Features | తెలుగా, ఆంద్రమా? - Site Administrator
| |
పల్లవ రాజు సివస్కందవర్మ (కీ.త. 4-గో నూరేడు) మయిదవోలు చెక్కింపులో వాడిన 'అందపదా' అనే మాట ఒక మండలానికి వర్తిస్తుంది, కాని జనులకు కాదు. పయిగా ఆ మాటకు సీమ అనే తెల్లము కూడా లేదు. 'అందపదా' అంటే అందకు లేక ఆంద్రకు దారి, లేక ఆంద్ర వయిపు సీమ అని కూడా తెల్లము రావచ్చు.
అన్నిటి కంటె గొప్ప వాదము ఇటీవల చరితాకారులు పుట్టించింది. ఇది కేవలము కల్పితమే, అయినా అన్నిటి కంటె బలీయంగా తయారు అయింది ఈ వాదన.
పురాణాలలో 30-మంది రాజులు ఆంద్రబృత్యులు అనే వారు మగదను 450 ఏళ్లు పాలించినారు అని ఇవ్వబడింది. ఈ ముప్పయి రాజుల పేరులు, వారి పరిపాలనా కాలాలు ఇవ్వబడి ఉన్నాయి. కాని మగద చరితలో ఇంత పెద్ద రాచకుటుంబాన్ని ఇరికించలేక పరిసోదకులు, చరితాకారులు కిందుమీదులు అయ్యే వేళలో వారికి వసతిగా మరాటా సీమ దొరికింది. నేటి మరాటా సీమలో, గోదావరి తీరాన ఉండే పయితాను (ఆనాడు ప్రతిష్ఠానపురము)ను రాజదానిగా చేసుకొని పాలించిన రాజులు కొందరు బయటపడినారు పరిసోదనల పంటగా. ఈ రాజులు బొంబాయికి దగ్గరగా పడమటి కనుమలలో కార్లే, జున్నారు, నాసికు వగయిరా చోట్లలో బవుద్ద గుహలు తొలిపించి, అక్కడ తమ చెక్కింపులను రాయించినారు. ఆ చెక్కింపులను పట్టి, ఇంకా దొరికిన నాణేలను పట్టి ఆ కుటుంబానికి చెందిన రాజుల పేర్లు కొన్ని, వారి కాలాలు తెలియ ఒచ్చినాయి. అవి సిముక, కన్న, హల, సాతకర్ణి, గవుతమీ పుత్త సాతకర్ణి, యాజ్ఞసిరి, పులమాయి వగయిరాలు. ఈ పేరులకు పురాణాలలోని ఆంద్రబృత్యులు అనే వారల పేరులకు కల పోలికను పట్టి పురాణాలలోని ఆంద్రబృత్యులు, చెక్కింపుల సాతవాహనులు ఒక్కరే అనే వాదనను లేవతీసి, ఆంద్రబృత్యులను దక్కనకు నెట్టి ఏసినారు చరితాకారులు.
కాని పురాణాలు ఆంద్రబృత్యులను సాతవాహనులు అని ఎక్కడా అనలేదు. చెక్కింపులలో ఎక్కడా వీరు ఆంద్రబృత్యులము అని రాసుకోలేదు. పయిగా ఆంద్రబృత్యులు మగద రాజులు, సాతవాహనులు ప్రతిష్టానపు రాజులు. ఇవి సరిపెట్ట వీలు లేని సంగతులు. అందుచేత చరితాకారులు ఈ అనుమానాలను ఒక పక్కకు నెట్టి పురాణ ఆంద్రబృత్యులే ప్రతిష్టానపు సాతవాహనులు అని సిద్దాంతీకరించినారు. కాని ఇది నిలదీసి అడిగితే నిలువలేని సిద్దాంతము. పయిగా వారు ఆంద్రులా? ఆంద్రబృత్యులా? అని ఒక వివాదము. ఆంద్రబృత్యులు అనే మాటకు ఆంద్రుల యొక్క బృత్యులు అని తెల్లమా, ఆంద్రులు అనే బృత్యులు అని తెల్లమా అని ఒక మీమాంస. తొలి తెల్లము ఒప్పు అయితే వారు ఆంద్రులు కారు, కాని ఆంద్రులు అనే వారి యొక్క బృత్యులు. అప్పుడు ఆంద్రులు అనే వారి కొరకు మనము ఎదుకుకోవాలి.
రెండో తెల్లము ఒప్పు అయితే వారిని ఆంద్రులు అన ఒచ్చును. కాని ప్రతిష్టానపు సాతవాహనులకు గల పొత్తు ఇంకా తేలలేదు.
అందుచేత ఈ వివాదాల మీద ఒక సందికి ఒచ్చి, చరితాకారులు పురాణ ఆంద్రబృత్యులు ప్రతిష్టానపు సాతవాహనులు ఒక్కటే అని మళ్ళీ మళ్ళీ తీర్మానించారు. ఇది కూడా గట్టిగా అడిగితే నిలిచే సిద్దాంతము కాదు. ఇంకా సాతవాహనులు బాపలు అనే సిద్దాంతము ఒకటి ఉంది. ఆంద్రబృత్యులు క్షత్రియులు. దీనిని కూడా సమరస పెట్టలేకపోయినారు చరితాకారులు. సాతవాహనులు ప్రాకృతాన్ని ఆదరించినారు. ప్రాకృతము అంటే మరాటీ అని అప్పకవి రాసి ఉన్నాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
![](../images/spacer.gif) |
Advertisements |
|
![](../images/spacer.gif) |
![](../images/spacer.gif) |
Advertisements |
|