|
|
Articles: TP Features | ధిక్కారమున్ సైతునా... - Site Administrator
| |
1994లో అప్పటి భారత్ బార్ కౌన్సిల్ చైర్మన్ సీనియర్ న్యాయవాది మిశ్రా ఒక కేసు విచారణలో వాదిస్తూ అలహాబాద్ హైకోర్టులోని ఒక న్యాయమూర్తిపై తీవ్ర స్వరంలో బెదిరిస్తూ మాట్లాడిన సందర్భంలో సుప్రీంకోర్టు ఆయనను కోర్టు ధిక్కరణ నేరం కింద ఆరు వారాలు తాత్కాలిక నిలుపుదల శిక్షను విధించి మూడు సంవత్సరాలు ఏ న్యాయస్థానంలోనూ వాదించకుండా ఉత్తర్వులు జారీ చేసింది.
నర్మదా ప్రాజెక్టు వివాదంలో సుప్రీంకోర్టు గేటు ముందు ప్రదర్శన చేస్తున్న ప్రఖ్యాత రచయిత్రి అరుంధతీరాయ్ కి సంజాయిషీ నోటీసు ఇవ్వగా దానికి ఆమె ఇచ్చిన సమాధానంలోని అంశాలు కోర్టు ధిక్కరణకు వస్తాయని ఆమెకు ఒక రోజు జైలుశిక్ష విధించారు.
ఈ మధ్యకాలంలో న్యాయస్థానాలు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. సమాచారహక్కు చట్టాన్ని ఆధారంగా చేసుకుని న్యాయవ్యవస్థ జవాబుదారీతాన్ని జనం కోరుతుండగా, న్యాయస్థానాల్లోని కొందరు వ్యక్తుల ప్రవర్తన ప్రశ్నార్థకంగా మారడంతో న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ పరిరక్షణ అనేది ఒక సవాలుగా మారింది. న్యాయమూర్తుల నియామకంలో రాజకీయ నీడలు, అవినీతి ఆరోపణల అక్రమ సంపాదన వార్తలు కోర్టు ధిక్కరణకు పాల్గొనకుండానే ధిక్కరిస్తున్నాయి. ఆరోపణలున్న వ్యక్తుల్ని న్యాయమూర్తులుగా నియమించడాన్ని కూడా ఈ రోజున ప్రజలు సవాలు చేస్తున్నప్పుడు, దీనికి బాధ్యుడెవరన్నది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరముంది.
సమాజంలో దిగజారుతున్న విలువలకి న్యాయస్థానం బలికావాల్సిన అవసరం లేదు. పనికట్టుకొని న్యాయవ్యవస్థని ధిక్కరించే వారి సంఖ్య తక్కువే. న్యాయవ్యవస్థ ప్రతిష్ట దిగజారడానికి న్యాయవ్యవస్థలోని వారు కారణభూతులు కాకూడదు. ప్రజల హక్కుల రక్షణకి, నిష్పాక్షకమైన, నిర్భయమైన అవినీతి రహిత న్యాయవ్యవస్థ తప్పక అవసరం. కాని దాని రక్షణకి ప్రశ్నించడం ధిక్కారం కాదు. కాకూడదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|