|
|
Articles: Short Stories | గ్రహణం - Site Administrator
| |
ప్రేయర్ జరుగుతున్నందువల్ల స్కూల్ గేట్లు వేసినారు. లేటుగా వచ్చిన పిల్లలంతా గేటు కడ్డీల్లోంచి స్కూలు వైపు చూస్తూ ఉన్నారు.
గేటుకి ఇవతల ఒకామె జామపళ్ళూ, బఠానీలూ చిన్న చాప మీద పెట్టుకొని అమ్ముతూ ఉంది. ఒకరిద్దరి పిల్లలు వాటిని కొంటున్నారు.
మమ్మీ! వచ్చేస్తి అంటూ నీలం నిక్కరూ, తెల్ల చొక్కా, గీతల టై, నల్లటి బూట్లు వేసుకున్న కాన్వెంటు స్కూలు పిల్లోడు ఒకడు ఉన్నట్టుండి అక్కడికి ఊడిపడ్డాడు.
ఎవర్ని ఆ పిల్లోడు మమ్మీ! అంటున్నది అని చుట్టూ చూశాడు చందు.
ఆ మమ్మీ ఎవరో కాదు. జామపళ్ళు అమ్మే ఆమేనని నిర్ధారించుకున్నాడు చందు.
మమ్మీ! డాడీ వచ్చేవరకూ నేను పోను అంటూ వీపుకు కట్టుకున్న బడి సంచీని తీయకుండానే అటూ ఇటూ పచార్లు చేస్తూ ఉన్నాడు. తల్లి వాడిని ఎంతో ముచ్చటగా చూస్తూ ఉంది.
ఓలే... రామాంజా! రేతిరి చెప్తివి సూడరా! అదేందో రయిము - అది చెప్పు అన్నదామె.
రయిము అంటే రైమ్ అని వెంటనే స్ఫురించింది చందూకి.
వాడు వాళ్ళమ్మని చూసి నవ్వి `ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్...' అంటూ చెప్పాడు.
జామపళ్ళ ఆమె కుటుంబ ఆర్థిక స్థాయి తెలుసుకొనేందుకు ఆమె భర్త చేస్తున్న ఉద్యోగం గురించి అడిగాడు చందు.
బేల్దారి పనికి పోతున్నట్టు చెప్పిందామె.
అంటే మునెయ్య లాంటి పరిస్థితే, జామపళ్ళ ఆమెది కూడా! వీళ్ళకి ఎక్కడనించి వచ్చింది ఇంగ్లీషు కాన్వెంటు మీద ఇంత మోజు! అన్నది అర్థం కావడం లేదతనికి.
పదిన్నరకల్లా పిల్లలిద్దర్నీ ఆ స్కూల్లో చేర్పించేసి వచ్చాడు చందు.
చూస్తున్నట్టే అయిదేళ్ళు గడిచిపోయాయి.
ఇప్పుడు చందు కూతురు పదోతరగతి పూర్తి చేసింది. 560 మార్కులతో జిల్లాలోనే మొదటి ర్యాంకులో పాసయింది. కొడుకు ఎనిమిదో తరగతి పాసయ్యాడు.
ప్రభుత్వానికి సరైన భాషా విధానం లేనందువల్ల మాతృభాష విద్యా విధానానికి స్వస్తి చెప్పి, కార్పొరేట్ స్కూళ్ళతోనూ కాన్వెంటు స్కూళ్లతోనూ పోటీపడుతున్నట్టు ఫోజు పెట్టి, ప్రభుత్వ స్కూళ్ళలోనే ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టింది.
వందలాది తెలుగు మాధ్యమ పాఠశాలలు ఇంగ్లీషు కాన్వెంటు స్కూళ్ళ ధాటికి తట్టుకోలేక మూసి వేస్తున్నట్టు రోజూ పేపర్లో వార్తలు... చందూకివన్నీ చదువుతూంటే కాళ్ల కింది భూమి కదిలిపోతున్నట్టుంది. ఇంక పల్లెల్లోని పిల్లలు ఎట్లా చదువుకోగలుగుతారు అని దిగులు పడతాడు.
ఆ సాయంత్రం కూరగాయల మార్కెట్టులో కనిపించాడు మునెయ్య చందూకి.
కుశల ప్రశ్నలు అయ్యాక-
పిల్లోడు ఏం చదువుతున్నాడన్నా అడిగాడు చందు.
వానికి ఆ సదువు అబ్బలేదప్పో! పని నేర్చుకోమని కమలానగర్లో ఉన్న మెకానిక్ షాపులో విడిచినాను అన్నాడు మునెయ్య.
వెంటనే చందూకి జామపళ్ళ ఆమె కొడుకు గుర్తుకు వచ్చాడు. వాడి పరిస్థితి అంతకన్నా మెరుగ్గా ఉంటుందా? అనిపించింది.
ఇప్పుడు రాష్ట్రంలోని గ్రామీణ పిల్లలందరూ మునెయ్య కొడుకుల్లా మారబోతున్నారా? అన్న నిలువెత్తు ప్రశ్నార్థకం చందు మనసులో...
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|