|
|
Articles: TP Features | బౌద్ధం మానసిక ఔషధం - Site Administrator
| |
బుద్ధ పథంలోకి రావడం కోసం నందుడు పడిన ఘర్షణను అశ్వఘోషుడు ఇలా వర్ణించాడు -
తం గౌరవం బుద్ధగతం చకర్ష
భార్యానురాగః పునరాచకర్ష
సోనిశ్చయాన్నాపియయోనతస్థా
తంన్ధరం సీష్వీవ రాజహంసః
(సౌందరనందం - పుట 12)
నందుడికి ఒక ప్రక్క బుద్ధుని పట్ల గౌరవం ముందుకు లాగుతుంది. సుందరి మీద ఉండే అనురాగం వెనక్కు లాగుతుంది. నీటి కొలనులో అలల మధ్య హంసలా నందుడు సంఘర్షణకు గురవుతున్నాడు.
అనేక మంది బౌద్ధ బోధకులు ముందు సంసారాలూ సంఘమూ అని కొట్టుకులాడి, సంసారాలను త్యజించి కొందరూ, సంసారాలతో పాటు కొందరు బౌద్ధ బోధలో చేరారు. తరువాత సంసారాలను త్యజించి సన్యాసులుగా మారే పద్ధతి వచ్చింది. ఏదైనా స్వార్థం వీడందే బౌద్ధం జీర్ణం కాలేదు. సన్యాసులైన వాళ్ళు కూడా కామమోహితులుగా వ్యవహరించి బౌద్ధానికి చెడ్డపేరు తెచ్చారు. జీవించే విధానమేదైనా సత్యం చెప్పడం, ధర్మాన్ని ఆచరించడం వ్యక్తిగత ఆస్తికి వెంపరలాడకపోవడం వంటి అంశాలను ఆచరించాక సంఘసేవ అనే ప్రక్రియ ముందుకు వస్తుంది. తమ కాలాన్ి ధనాన్ని సంఘానికి సమర్పిస్తున్న చాలా మంది బోధకుల్లో ద్వేషం, మాత్సర్యం ఉండడం వలన ఆధిపత్య భావాలు వస్తున్నాయి. అందుకే బౌద్ధంలోని తాత్వికాంశాలు కావ్యాలుగా మారినపుడు కూడా ప్రతి పాత్ర సంఘర్షణకు గురయ్యింది. అందుకే భారతదేశ విద్యలో బౌద్ధం పాలు పెంచుకోవలసి ఉంది.
ప్రతి మనిషి రాగద్వేషాలు కలిగే ఉంటాడు. ఇందులో త్యాగం పాలు పెంచాలంటే తప్పక బౌద్ధ సాహిత్య అధ్యయనం తప్పదు. అంబేడ్కర్ భారత రాజ్యాంగ రచన శిల్వి మాత్రమే. వ్యక్తిగత ఆస్తి సిద్ధాంతం ఆనాటి పాలకవర్గ అభిప్రాయం. కాని అది ఈనాడు భారతదేశంలో నల్లధనం నిల్వలకు కారణం కావడమే కాక, దోపిడీ సిద్ధాంతాలకు పాదుల వేసింది. నీవు శ్రమ చేసిన సంపద నీదే కాని ఇతరుల శ్రమను దోచుకొనే హక్కు నీకు ఎవరు ఇచ్చారు. నీకు కలిగిన సంతానాన్ని నీవు ప్రేమించు. వారి బిడ్డలను కూడా ప్రేమించు. కాని నీ బిడ్డల్లాగే ఎందరో బిడ్డలు జన్మించారు. వారు దుఃఖంలో ఉన్నారు. వారినీ ప్రేమించు. అప్పుడే సమాజంలో సౌభ్రాతృత్వం, సమతుల్యత విస్తరిస్తాయి. అయితే, ఈ భావాలన్నీ ఒక తత్వం నుండే మెదళ్ళలోకి ఎక్కాల్సి ఉంది. ఏదో ఒక ప్రవక్త, తత్వవేత్తపై మనకున్న నమ్మకం వలన ఆ బోధనలు మనపై ఔషధంలా పనిచేస్తాయి. అయినా అవి సమకాలీనంలో హేతుతర్కానికి గురికావాల్సి ఉంది. సమకాలీన సమాజ పరిణామానికి ఆ సూత్రాలు ఉపయుక్తం కావలసి ఉంది.
బౌద్ధం ఒక సామాజిక ఔషదం. మానవుల్లో రుగ్మతని అది రూపుమాపుతుంది. మానవుడు నిరంతరం వ్యామోహ భరితుడవుతున్నాడు. ధనం మీద, అధికారం మీద, సౌందర్యం మీద, పుత్రుల మీద అనేక రకాలైన వ్యామోహాలు పట్టి పీడిస్తున్నాయి. దీనిక తప్పక ఔషధం అవసరం. ఇది బౌద్ధ తత్వశాస్త్రం నుండే లభిస్తుంది. భారతీయులు అనేక ఔషధాలు సేవిస్తున్నారు. అవి శరీరానికి మాత్రమే. బౌద్ధం మానసిక ఔషధం. అది అధ్యయనం నుంచి ఆచరణ నుండి లభిస్తుంది. అందుకే బౌద్ధ ధర్మ బోధనకు, సాహిత్య సిద్ధాంత వ్యాప్తికి పునరంకితం అవుదాం. భారతదేశ పునరుజ్జీవనానికి పాడుపడదాం.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|