|
|
Articles: Short Stories | పోరాటం - Editor
| |
సత్తెమ్మ, సింహాద్రి మాట్లాడేదంతా వాస్తవమే. ప్రస్తుతం మన ప్రాంతాన్ని సెజ్ గా ప్రకటించిన తర్వాత ఇక్కడంతా మారిపోయింది. ప్రభుత్వం ఓ పక్కన ప్రజామోదానికి విరుద్ధంగా భూములు తీసుకోవడం లేదని పేపర్లో ప్రచారం చేస్తోంది. కానీ సెజ్ ప్రకటిత ప్రాంతాలలో ఆయా జిల్లా కలెక్టర్లతో సహా ప్రభుత్వ యంత్రాంగమంతా రైతులను భూములు వదిలి వెళ్ళాల్సిందిగా సామ, దాన భేద, దండోపాయాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బెదిరిస్తూ తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు. బెదిరి పోయిన కొందరు రైతులు చచ్చినాడి పెళ్ళికి వచ్చినంత? అన్నట్లు వారిచ్చే నష్టపరిహారం తీసుకొని భూముల్ని వదిలి వెళ్తున్నారు. అయితే అలా చాలా తక్కువ మంది మాత్రమే వెళ్తున్నారు. మొన్నే మన భూషయ్య మామ నష్టపరిహారం తీసుకోవడానికి వెళ్తూ నన్ను తోడు రమ్మన్నాడు. వద్దని ఎంత పోరినా వినలేదు. తీరా వెళితే ఆ భూమిని ప్రభుత్వానికి కాక, ప్రైవేటు కంపెనీ పేరు మీద రిజిస్టర్ చేస్తున్నారు. నాకయితే పూర్తిగా అర్థం కాలేదు. కానీ అక్కడేదో గోల్ మాల్ జరుగుతోందని అన్పిస్తోంది అన్నాడు బాలకోటి.
అవును కోటీ! సెజ్ కోసం సేకరిస్తున్న భూమి మొత్తం పరిశ్రమల స్థాపనకు వినియోగించరు. అతి తక్కువ భూమి మాత్రమే వారికి అవసరం. మిగిలిన భూమిలో చాలా భాగం భవిష్యత్తులో ఆ పారిశ్రామికవేత్తల రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం అన్నాడు శివ.
ఇంతలో వూరు రావడంతో ఒక్కొక్కరు ఆటో దిగడం మొదలుపెట్టారు. వీధి మొదట్లో దిగబోతున్న శివను వారించి, ఇంటింముందుకు తెచ్చి ఆపాడు బాలకోటి. కాఫీ తాగి వెళుదువుగాని రమ్మన్న శివకు సాయంత్రం ఖాళీ సమయంలో వస్తానని చెప్పి ఆటోను రివర్సు చేసుకొని వెళ్లాడు బాలకోటి.
వాకిట్లో నిలబడిన శివను చూడగానే వంటింట్లోంచి వస్తున్న సుభద్ర ఆనందంతో తబ్బిబ్బవుతూ భర్తను పిలిచింది. శివ వచ్చాడని గ్రహించిన సుబ్బారావు చేతిలో ఉన్న పనిని వదిలి వచ్చాడు. ఆదుర్దాగా తన చదువు గురించి, కాలేజి గురించి, తిండి గురించి ప్రశ్నిస్తున్న తల్లితండ్రులకు జవాబిస్తూ ఇల్లంతా కలియదిరిగసాగాడు శివ. ఇల్లూ వాకిలి పరిశీలిస్తున్న కొడుకును చూస్తున్న సుభద్రమ్మకు దు:ఖం లావాలా ఉబికి వచ్చింది. ఇంకెన్నాళ్ళో ఈ ఇంటితో తమకు రుణం ! అనుకుంటూ కళ్లు వత్తుకున్న ఆమె కొడుకు కోసం లేని ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటూ శివతో పాటు వెనుక పెరట్లోకి వచ్చింది.
మనూళ్ళో ఎంతమంది భూముల్ని అమ్ముకున్నారు నాన్నా? అడిగాడు శివ.
మొదట్లో వాళ్ళ బెదిరింపులకు భయపడి ఒకళ్ళిద్దరు అమ్మారురా! కానీ తర్వాత అమ్మిన వారంతా ఊళ్ళో ఉండకుండా వేరే నగరాల్లో బ్రతుకుతున్న వాళ్ళే ఎక్కువమంది వాళ్ల భూముల్ని అమ్ముకున్నారు. ఊరి జనమంతా కలిసికట్టుగా భూముల్ని అమ్మొద్దని నిర్ణయించుకున్నాం. అయితే మనూరి ప్రెసిడెంటు బామ్మర్ది ద్వారా అమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. రైతులు వాళ్ళ మాట వినడం లేదని ఆఫీసర్లని పిలిపించి మాయమాటలు చెప్పిస్తున్నారు అన్నాడు సుబ్బారావు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|