|
|
Articles: TP Features | 'ఉపా' సర్కార్ ఫీట్లు, పాట్లు! - Mrs. Aravinda Desai
| |
అణు విద్యుత్ సంస్థ (ఎన్ పిసి) తారాపూర్ లో రెండు భారీ, 540 మెగావాట్ల దేశీయ అణు విద్యుత్ రియాక్టర్లను ఏర్పాటు చేసింది. కాని ఆ ప్లాంట్లకు ఇంధనం కొరత ఎదురైంది. అంతే కాకుండా యురేనియం ఇంధనం అవసరాలను 'తగ్గించినందుకు' సంస్థ కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ (సిఎజి - కాగ్) నుంచి విమర్శలను కూడా ఎదుర్కొన్నది. అయితే, అణుశక్తి శాస్త్రవేత్తలు, దౌత్యవేత్తల సహకారంతోను., అమెరికాతో మూడేళ్ళకు పైగా సాగించిన సంప్రదింపుల కారణంగాను ప్రభుత్వం పాశ్చాత్య దేశాలతో అణు ఇంధన రంగంలో వాణిజ్య పరమైన సహకార ఒప్పందాలతో దేశాన్ని కొత్త శకం దిశగా నడిపింది.
ప్రపంచవ్యాప్తంగా పోటీపడేందుకు 'లీడర్ షిప్' టెక్నాలజీలను వృద్ధి చేసేందుకు భారత వైజ్ఞానిక, పరిశోధన మండలి (సిఎస్ఐఆర్) ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. కాని, ఈ కార్యక్రమం మొదటి దశలో చేపట్టిన పలు ప్రాజెక్టులు ఇంకా వాణిజ్య రూపు దాల్చవలసి ఉంది. ఉదాహరణకు, ఒక అంటువ్యాధికి చికిత్సలో 'కొత్త మలుపు' కాగలదిగా సిఎస్ఐఆర్ నాలుగు సంవత్సరాల క్రితం పేర్కొన్న ఒక అణువు (మాలిక్యూల్) ఇంకా మార్కెట్ లోకి రాలేదు. అయితే, సంప్రదాయానికి భిన్నంగా సైన్స్ విభాగాలు అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే 2004 - 09 కాలంలో జనానికి అందుబాటులోకి రావడానికి విశేషంగా ప్రయత్నించినట్లు కనిపిస్తున్నది. సైన్, టెక్నాలజీ శాఖ మంత్రి కపిల్ సిబల్ ఇందుకు ఎక్కువ ప్రేరణ ఇచ్చారు.
తమ శాఖలు పన్ను చెల్లింపుదారుల డబ్బును ఏవిధంగా ఖర్చు చేస్తున్నదీ వివరించేట్లుగా సిఎస్ఐఆర్, బయోటెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ విభాగాల అధికారులను సిబల్ ప్రోత్సహించారు. వారి కార్యక్రమాల జాబితాలు విజయాలు, వైఫల్యాల గురించి తెలుసుకోవడానికి ఉపకరించాయి. పాల లక్షణాలు గల ప్రొటీన్ తో కృత్రిమంగా ఒక మొక్కజొన్నను బయోటెక్నాలజీ అధికారులు ఆవిష్కరించారు. ఎర్త్ సైన్సెస్ విభాగం అధికారులు చెన్నై తీరంలో రోజుకు పది లక్షల లీటర్ల ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చగల ప్లాంట్ ను ప్రదర్శించారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|