|
|
Articles: Short Stories | జానకి - Site Administrator
| |
ఒక రోజు జానకి పనిచేసే ఆఫీసులోనే వేరే డిపార్ట్ మెంట్లో పనిచేసే సునీత కనిపించి 'ఏమిటి అలా డల్ గా వున్నావు?' అంటూ ప్రశ్నించింది. వయసులో, చదువులో, అనుభవంలో అన్నిటా ఎంతో పైన వున్న సునీత అలా అడిగేసరికి జానకి ధైర్యం చేసి తన మనసులోని భయాన్ని బయటకు చెప్పేసింది. జానకి చెప్పిందంతా విని సునీత నవ్వుతూ, 'ఇదా నీ భయం నీ పిల్లలు నీకు చిన్నవాళ్ళుగా కనిపించవచ్చు. కానీ వాళ్లు పెద్దవాళ్ళవుతున్నారు. దాన్నే ఇక్కడ యడలెసన్ స్టేజ్ అంటారు. ఫిజికల్ గా, మెంటల్ గా వాళ్ళలో మార్పు రావడం సహజం. అది నువ్వు అర్థం చేసుకోవాలి' అంటూ చెప్పుకుపోతున్న సునీతను మధ్యలోనే ఆపుచేసి, 'కానీ... వాళ్ళు నాతో శత్రువుతో మాట్లాడినట్లు మాట్లాడుతుంటేనూ, నన్ను హేళన చేస్తూ అస్తమానం నన్ను విమర్శిస్తుంటేనూ నేను ఎలా భరించేది, వాళ్ళను ఎలా పెంచేదీ' అంటూ కన్నీళ్ళతో ప్రశ్నించింది జానకి. సునీత వెంటనే 'నీ బాధ నాకు తెలుసు జానకీ, ఎందుకంటే అది నాకూ అనుభవమే. కాని నువ్వు తల్లినని మర్చిపోయి, ఒక్క క్షణం వాళ్ళ వైపు నుంచి ఆలోచించు. వాళ్ళు మనల్ని గౌరవించడం లేదు, మన మాట వినడం లేదు అని అనుకుంటాం. కానీ రోజూ వాళ్ళు బయట ఎన్ని అవమానాలకు, విమర్శలకు, ఛాలెంజ్ లకు గురి అవుతారో తెలుసా?
వెలి వేసినట్లు ప్రత్యేకంగా కనిపించే మన పిల్లల్ని, బయట పిల్లలు ఎంత వత్తిడి చేస్తారో ఊహించగలవా? అందరు పిల్లలు చేసే పనులను చెయ్యకూడదని మన పిల్లల మీద ఆంక్షలు పెడతాం. ఇంట్లో ఒకటి చూస్తే, బయట వేరొకటి చూస్తారు. ఎదిగీ ఎదగని వయసులో వాళ్ళకు ఇదంతా అయోమయంగా అనిపిస్తుంది. మానసికంగా వాళ్ళలో ఘర్షణ మొదలవుతుంది. మనం పెరిగినట్లు మన పిల్లల్ని ఇక్కడ పెంచుదామంటే కుదరదు జానకీ. ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరుగుతున్న నీ పిల్లలకు తెలిసిన ప్రపంచం ఇదే. అందుచేత వాళ్ళ పరిస్థితుల్ని, వాళ్ళ మనస్థత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళకు నెమ్మదిగా నచ్చచెప్పుకోవాలి. నువ్వు ఏమి అనుకోనంటే ఓ మాట చెప్తాను. వాళ్ళు మారిపోతున్నారని బాధ పడేకంటే, ఇక్కడి పరిస్థితులకు తగినట్లుగా నీ పిల్లల్ని పెంచడానికి తల్లిగా నువ్వు మారటం ముఖ్యం అన్నది తెలుసుకో' అంటూ మృదువుగా భుజం తట్టి వెళ్లిపోయింది సునీత.
సునీత చెప్పిన మాటలు జానికిని ఆలోచింప చేశాయి. జానకి నెమ్మదిగా ఇంటిని, ఇంటి పద్ధతుల్ని, తనని మార్చుకోవడం మొదలు పెట్టింది. కష్టపడి ప్రత్యేకంగా క్లాసులు కూడా తీసుకుని ఇండియన్ యాక్సెంటు లేకుండా ఇంగ్లీషు మాట్లాడగలగడం అలవాటు చేసుకుంది. పిల్లలతో మాట్లాడటానికి సినిమాలు, సంగీతం బాగా ఉపయోగపడతాయని గ్రహించిన జానకి వాళ్ళకిష్టమైన మూవీస్ గురించి, వాళ్ళు వినే మ్యూజిక్ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టింది. ఇంతకు ముందులాగ పిల్లల్ని అన్నమే తినాలని బలవంతం చేయడం, తినకపోతే బాధపడడం మానుకుంది. పైపెచ్చు వాళ్ళకోసమని ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు తిరగేసి వాళ్ళ కిష్టమైన వంటలు చెయ్యడం నేర్చుకుంది. పూర్వం లాగ రేఖను ఆరునూరైనా పార్టీలకు ఇండియన్ బట్టలే వేసుకోవాలని బలవంతం చేయడం మానుకుంది. నెమ్మదిగా సునీత చెప్పిన మాటల్లో అర్థం తెలిసి రాసాగింది జానకికి. ఈ దేశంలో పిల్లలతో స్నేహంగా వుంటూ ఇష్టమున్నా లేకపోయినా వాళ్ళలో కలిసిపోయి వాళ్ల ప్రపంచంలోకి అడుగు పెడ్తే తప్ప వాళ్ళను పెంచలేమన్న సత్యాన్ని తెలుసుకుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|