|
|
Articles: Politics | ప్రజాస్వామ్యం అపహాస్యం! - Site Administrator
| |
కేరళలో వామపక్షాలు కరుడుగట్టిన ఒక తీవ్రవాదిని, అద్వానీని హత్యచేయడానికి ప్రయత్నించిన కేసులో నిందితుడిని దరి చేర్చుకొనే ప్రయత్నం చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి పరులు, నేరచరిత్ర కలవారు, అక్రమంగా ధనం సంపాదించినవారిని అభ్యర్థులుగా నిలబెట్టడంలో అన్ని పార్టీలు పోటీపడుతున్నాయి.
ఎన్నికలలో నేరచరిత్రులను అభ్యర్థులుగా ఎంపిక చేయవద్దని, ఓటర్లను ప్రలోభపరచడానికి మద్యం, నగదు పంపిణీ చేయబోమని హామీ ఇవ్వాలని ఎన్నికల నిఘా వేదిక బృందం కోరితే ఒక్క ప్రధాన రాజకీయ పార్టీ కూడా ముందుకు రాలేదు. ఎన్నికల సమయంలో ధనం ఎక్కువ వాడకంలో ఉంటుంది, ప్రజలు సంతోషంతో రెండు బాటిళ్ళు ఎక్కువగా కొంటే తప్పేమిటని ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి నిస్సిగ్గుగా పేర్కొన్నారు.
మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఇటువంటి ప్రధాన రుగ్మతులను నిరోధించడానికి ఏ రాజకీయ పార్టీ ముందుకు రావడం లేదు. వరుణ్ గాంధీపై దాడికి పూనుకోవడం ఓట్ల రాజకీయమే కనిపిస్తోంది. ఇటువంటి కుట్రలో ఎన్నికల కమిషన్ భాగస్వామి అయినట్లు కనిపించడం బాధాకరం.
చట్టప్రకారం వరుణ్ గాంధీ పై చర్య తీసుకోవాల్సిందే. ఆయన ప్రసంగించినట్లు వచ్చిన ఆరోపణలపై తగు విచారణ జరిపి నిజం నిగ్గు తేల్చాల్సిందే. కానీ ఆ సాకుతో విద్వేషాలు రెచ్చగొట్టడంలో మన ప్రసార సాధనాలు సహితం తమ వంతు పాత్ర పోషించాయి!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|