|
|
Articles: Devotion | సాయి లీలలు - Mr. Syam Satyanarayana Konduri
| |
రెండవ ప్రపంచ యుద్ధానంతరం రామయ్య నిజాం రాష్ట్ర రైల్వేలో జీవనభృతి కోసం ఉద్యోగంలో చేరారు. వీరికి 1939 లో శ్రీమతి లక్ష్మీకాంతంతో వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా ఈయన మరట్వాడలో పనిచేసేటప్పుడు మహారాష్ట్రలోని సాధువులు సత్పురుషుల దృష్టి ఆయనపై ప్రసరించి ఆయనలో నూతన చైతన్యం కలిగి, సాధు సత్పురుషుల సేవా భాగ్యాన్ని పొందారు. సాయిబాబా అనుగ్రహాన్ని పొందిన రామయ్యలో దాతృత్వ భావం బాగా ఎక్కువ. తన, పర అనే భేదం లేకుండా సహాయ సహకారాలు అందించేవారు. భారత రామయణ గ్రంథాలలోని వేల పద్యాలు ఎప్పుడూ ఆయన నోట శ్రావ్యంగా వినిపించేవి. తీరిక వేళల్లో సహ ఉద్యోగులే కాక తాను నివసించే ప్రాంత వాసులు కూడా వచ్చి వీరి ద్వారా రామయణ, భారత శ్లోకాలను అర్ధ తాత్పర్యాలతో విని తరించేవారు.
నిజాం హయాంలో 1948 లో చెలరేగిన రజాకార్ల విధ్వంసకాండ సంధర్భంలో రామయ్య మరట్వాడ (ఇప్పటి మహారాస్ట్ర) లోని ముఘట్ రైల్వేస్టేషన్ మాస్టర్ గా పనిచేస్తూ ఉన్నప్పుడు కాల్పులలో ఒక బుల్లెట్ వారి కుడి కాలులోకి దూసుకుపోయింది. అప్పటి నుంచి ఆయన నడిచేందుకు జీవితాంతం చేతికర్రను ఊతంగా చేసుకోవలసి వచ్చింది. ఆయన ఉద్యోగ సందర్భంలో ఎన్నో అవార్డులు, నిజాం రైల్వే ద్వారా అందుకున్నారు.
రామయ్య అనేక విద్యా సంస్థలకు, వృద్ధాశ్రమాలకు, పేద విద్యార్ధులకు గుప్తదానాలెన్నో చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఔరంగబాద్ లో సాయిబాబా ఆలయ నిర్మాణానికి యధోచితంగా సహాయాన్ని అందించారు. వారికి ఔరంగాబాద్ అంటే ఆపేక్ష ఎక్కువ. అందువల్లనే వారి చివరి దశలో కొత్తగా నిర్మిస్తున్న మందిరంలో సాయిబాబాను చూసి తరించాలన్న కోరిక కోరికగానే మిగిలిపోయింది. వారి జీవన విధానంలో సాయిబాబా అగోచరంగా కనిపిస్తూనే ఉంటారు. బాబా పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది వారు తమ 92వ ఏట 2009 జనవరి 12న బాబా ఆత్మలో లీనమయ్యారు. బాబా ఆజ్ఞానుసారం వారి నేత్రాలను ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్ స్టిట్యూట్ కు దానం చేశారు.
కృష్ణాతీర వాసుడైన రామయ్య కోరికను అనుసరించి ఆయన చితాభస్మాన్ని కృష్ణానది గర్భంలో నిమజ్జనం చేసేందుకు నిశ్చయించారు. రామయ్యగారి ఇద్దరు కుమారులతో కలిసి చితాభస్మ కలశాన్ని తీసుకొని సమీపంలోని నాగార్జునసాగర్ కు సికిందరాబాద్ నుండి ఉదయం 6 గంటలకు బంధుమిత్రులతో కలిసి బయలుదేరి వెళ్ళారు. తరచి చూస్తే ఇక్కడి నుండే బాబా లీలలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి అనిపిస్తున్నది. మార్గమధ్యంలో ఎవరి ప్రమేయమూ లేకుండానే కారు సరైన మార్గంలో పొతూ ఉన్నట్లుండి ఒక శివాలయం వద్ద పక్కకు వెళ్ళి గుడికి ప్రదక్షిణం చేసి మళ్ళీ వచ్చి అదే మార్గంలో అక్కడే కలిసింది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|