|
|
Articles: TP Features | `మెగా'కు కోటరీయే దగా - Site Administrator
| |
వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు నాయుడు స్థాయికి చేరుకోవాలంటే 40 ఏళ్లు పడుతుంది. వాళ్లతో పోల్చుకోవడం కరెక్టు కాదు. ప్రజారాజ్యం నుంచి ఏ నాయకుడు, ఎప్పుడైనా పార్టీ నుంచి వెళ్లే పరిస్థితి ఉందని ఆయన చెబుతున్నారు. పార్టీ ఓడిన తర్వాత కాపులు ఈ పార్టీకి ఎందుకు మద్దతునిచ్చామా అని బాధపడుతున్నారని, అటు కాంగ్రెస్కు - ఇటు టిడిపికి కాకుండా ఈ పార్టీలో చేరి నష్టపోయామన్న భావనతో ఉన్నారని, పార్టీపై కాపు ముద్ర బాగా ఉందని, దానివల్ల బీసీ, దళితులు దూరమయ్యారని, ఎన్నికల ముందు సీనియర్లను పక్కకు పెట్టి, వన్మ్యాన్ షో చేశారనే నిజాలను ఆయన ఏకబిగిన బయటపెట్టారు. `చిరంజీవిని నమ్ముకుని చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. పాపం కుర్రాళ్లయితే చాలామంది. సామాజిక న్యాయం జరగాలన్న లక్ష్యంతో నాలాంటి సీనియర్లంతా పార్టీలో చేరాం. మేమేమీ పదవులు ఆశించి రాలేదు. ఈ వయసులో మాకేం కావాలి? కానీ సామాజిక న్యాయ నినాదం ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమయ్యారు. దాని అర్ధం ఏమిటన్నది ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు' అంటూ కెఎస్ ఆర్ మూర్తి ఆవేదన పడుతున్నారు.
ఇంకా ఆయన ఏమంటున్నారంటే మా జిల్లాలో అయితే మరీ ఎక్కువ. టికెట్ల అమ్మకాలపై అవినీతి ఆరోపణలొచ్చాయి. దానిపై విచారణ జరిపించి, కమిటీ వేయమని నేను, శివశంకర్, ఉపేంద్ర చెప్పాం. అప్పటి నుంచి మమ్మల్ని పట్టించుకోకుండా పక్కకు పెట్టారు. మమ్మల్నే కాదు, సీనియర్లందరినీ పక్కకు పెట్టారు. మాకంటే మిత్రా లాంటి వాళ్లు డెడికేషన్తో పనిచేశారు. అలాంటి వాళ్లందరిదీ అదే పరిస్థితి. దాని వల్ల మాకేమీ నష్టం లేదు. మేం ముగ్గురం కూడా ఒక దశలో పిలిస్తేనే వెళ్లాలని తీర్మానించుకున్నాం’ ‘పార్టీ ముందుకు వెళ్లడం, వెళ్లకపోవడం అంతా చిరంజీవి చేతుల్లోనే ఉంది. పార్టీలో వన్మ్యాన్షో జరుగుతోంది. పార్టీలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. ఎవరికీ ఏ బాధ్యతా అప్పగించరు. ఎవరిని అభ్యర్ధులుగా ఎంపిక చేశారో కమిటీలో ఉన్న మాకెవరికీ తెలియదని ఆయన చెప్పారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|