|
|
Articles: TP Features | మార్పంటే ఇదే! - Site Administrator
| |
ఇంతలో ఒక కాంతిరేఖ. అదృష్టం కొద్దీ డా.బిందేశ్వర్ పాథక్ తో పరిచయం అయింది. 2003 సంవత్సరంలో సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఈ ఎన్ జి వో నిర్వహిస్తున్నాడు. ఆల్వార్ జిల్లాలో ఈ హీన వృత్తికి అంకితమైపోయిన 'పాకీపని' మనుష్యులను (మాన్యువల్ స్కావెంజర్లను) ఎలాగైనా ఇతర సామాజికవర్గ ప్రజలతో గౌరవజీవనం గడిపేలా చేద్దామనుకున్నాడు.
అతను 'కొత్త దిక్కు' (న్యూ డైరెక్షన్ - నయీ దిశాయేన్) అనే కేంద్రం ఏర్పరిచాడు. కొత్త వ్యాపకాలు, వ్యాపారాలు వీరిచేత పెట్టించాడు, చేయించాడు. వారికి తగిన శిక్షణ ఇప్పించాడు. కొన్ని రకాల వంటల తయారీ, కుట్టుపనులు, ఎంబ్రాయిడరీ వంటివి నేర్పించాడు. 2003లో మొదటి బ్యాచ్ లో 28 మంది ఇలా నూతన విద్యలు నేర్చుకొన్నారు. తరువాత చేర్చుకొన్న రెండవ శ్రేణిలో వీరి సంఖ్య రెట్టింపయింది. ఉదయం 10.30 నుంచి సాయంకాలం 4.00 వరకు పని చేసేవారు. నెలకి రూ.200 సంపాదించేవారు. రకరకాల ఆహార అదనపు వంటకాలతో బాటు కొవ్వొత్తులు తయారుచేసేవారు. వీటిని ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలలో మొదట్లో మాత్రం అవి ఎవరూ కొనేవారు కాదు. అంటరాని, పారిశుధ్య కార్మికులు చేసినవా అని చీదరించుకునేవారు. కాని ప్రస్తుతం పరిస్థితులు బాగా మారాయి. వాళ్ళు తయారుచేసే వస్తువుల వైవిధ్యం మరింత పెరిగింది. సేమియా, అప్పడాలు, ఊరగాయలు ఇలాంటివి ఇంట్లోనే తయారీ మొదలు పెట్టారు. వాటివల్ల మరో రూ.2000 వరకు నెలకు ఆదాయం వస్తోందని ఉషా చౌమార్, 33 ఏళ్ళ వయసు వనిత సంబరబడిపోతోంది.
మొదట్లో డాక్టర్ పాథక్ చెప్పేదాని మీద మాకు నమ్మకం కలగలేదు అంది సునీత. ఈ నికృష్ఠ వృత్తి నుంచి మాకు విముక్తి ఎవరు ప్రసాదిస్తారు అంటూ కేవలం మమ్మల్ని నిస్పృహే ఆవరించేది. కాని ఆల్వార్ వచ్చి వెళ్ళిన కొద్ది నెలలకే పాథక్ మమ్మల్ని ఢిల్లీకి రమ్మని పిలిచారు. ప్రపంచ టాయిలెట్ శిఖరాగ్ర సమావేశం. మమ్మల్ని అయిదు నక్షత్రాల మౌర్య షెరాటన్ హోటల్ లో దింపారు. అంతే. ఏదో జరగబోతోంది. మా జీవితాలు శాశ్వతంగా తప్పక శుభప్రదంగా మారతాయి అనే నమ్మకం కలిగింది. తిరిగి ఆల్వార్ చేరుకొన్నాక...
శకుంతల - 35 ఏళ్ళు - ఈ బృందంలోని వ్యక్తే. అంతో ఇంతో ఇంగ్లీషు కూడా మాట్లాడతాం. మా పిల్లలను ఇంగ్లీషు బడులకు పంపుతున్నాం. గతంలో ఇవి సాధ్యమేనా. ఆ కేంద్రం మాత్రం మాకు కలలో కూడా అనుకోనివి ప్రసాదించింది' అంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|