|
|
Articles: TP Features | ఢిల్లీ నుంచి 'కాష్ ట్రాన్స్ఫర్' - Site Administrator
| |
సంసారం నడపడంలో కష్టనష్టాలు తెలిసిన గృహిణిగా ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అమలు చేస్తున్న మరో పథకం కూడా మాహిళల్ని లబ్ధిదారులుగా చేసుకున్నదే. మహిళ పేరిట ఉన్న బ్యాంకు ఖాతాకు రేషన్ కు బదులుగా నెలకు 1100 రూపాయలు బదిలీ చేయడం దేశంలో ఇదే మొదటిసారి. దారిద్ర్య రేఖకు దిగువ వర్గాలకు రేషన్ షాపుల ద్వారా సరకులు అందించేందుకు ఏటా 52 వేల కోట్ల రూపాయలు సబ్సిడీగా ఇస్తున్నారు. అయితే రేషన్ షాపుల్లోని రేషన్ సరుకులు మాత్రం లబ్ధిదారులకు సవ్యంగా చేరడం లేదన్నది కఠోర వాస్తవం.
నెలకు మహిళ పేరిట ఇచ్చే నగదుతో 30 కిలోల వరకు రేషన్ ను బహిరంగ మార్కెట్ లో కొనుగోలు చేసే శక్తి లభిస్తుందన్నది ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అభిప్రాయం. ఈ విధంగా రేషన్ కు బదులు నగదు ఇవ్వడం వల్ల ఆ 'మొత్తం' ప్రయోజనం కుటుంబంలోని అందరికీ చేరదని, బాలికల పట్ల వివక్షత చూపుతారన్నది కొందరి అభిప్రాయం. కానీ, పేదల కోసం ప్రభుత్వం వ్యయం చేసే రూపాయిలో లబ్ధిదారులకు చేరుతున్నది కేవలం 10 పైసలేనని దివంగత రాజీవ్ గాంధీ ముంబాయిలో జరిగిన కాంగ్రెస్ శత వార్షికోత్సవాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటికీ, ఈ నాటికీ పరిస్థితుల్లో ఇసుమంతైనా మార్పు రాలేదు! ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి లబ్ధిదారునికి మధ్య ఉన్న దొంతరల్ని తొలగిస్తూ నేరుగా నగదు అందించే ఈ పథకాలు రానున్న రోజుల్లో ఓట్ల బదిలీ కోసం రాజకీయ వర్గాలకు 'ఆకర్షణీయం'గా మారొచ్చు!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|