|
|
Articles: TP Features | నేతల 'వాయు' జపం - Site Administrator
| |
వాస్తవానికి కేజీబేసిన్ లో రోజుకి 40 ఎంఎంఎస్ సీఎం ఉత్పత్తి సామర్థ్యం ఉందని ఆర్ ఐఎల్ ప్రకటించింది. గ్యాస్ డిమాండ్ పై ఆర్ ఐ ఎల్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ గ్యాస్ వినియోగానికి అవసరమైన అనుసంధాన వ్యవస్థ లేకుండా తమ అవసరాలకు గ్యాస్ కావాలని రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. ఉత్పత్తి అవుతున్న గ్యాస్ ను ఎరువుల కర్మాగారాలకు విద్యుత్ కేంద్రాలకు ఎల్ పీ జీ ఫ్లాంట్లకు, నగరాల్లో వంటింటి గ్యాస్ కు మంత్రుల బృందం కేటాయించింది. అయితే దీర్ఘకాలంగా పనిచేస్తున్న కొన్ని ఎరువుల కర్మాగారాలు ఆ గ్యాస్ ను వినియోగించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదు. అలాగే నగరాల్లో గ్యాస్ పంపిణీకి అవసరమైన పైప్ లైను లను కూడా వేయలేదు.
వనరులు పుష్కలంగా ఉన్నా వాటిని వినియోగించేందుకు అవసరమైన సరఫరా మార్గాలను ఏర్పాటు చేయడంలో పాలకులకు ముందుచూపు కొరవడింది. ఇకనైనా గ్యాస్ వాటాతో పాటు కేటాయించిన గ్యాస్ మొత్తాన్ని సమర్థవంతంగా వివిధ రంగాల్లో వినియోగించే అవకాశాలను మెరుగుపరిచేందుకు దృష్టి సారించాలి. లేకపోతే 'సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం - ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు' అన్నట్లు కాగలదు. తస్మాత్ గ్యాస్ జాగ్రత్త!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|