|
|
Articles: Short Stories | ఉంగరం - Miss rajeswari rajeswarinedunuri
| |
అంతా విన్న భర్త 'మనకెందుకు మన డ్యూటీ అయిపోయింది. వాళ్ళ బుద్ధి వాళ్ళకే, అమ్మలు ఏదైనా మంచి నేర్పి ఉంటే కాస్త మారతారు లేదా మన ఖర్మ .ఇంకా నయం విడాకులిచ్చే, కోడళ్ళు లేచి పోయే కోడళ్ళు, విషం కలిపే కోడళ్ళు వస్తున్న ఈ రోజుల్లో మనం సంతోషించాల' అని భార్యని ఊరడించాడు. వడ్డించిన విస్తరిలా అన్నీ అమర్చిన ఇంట్లో అడుగు పెట్టిన కోడళ్ళకి ఎందుకిలాంటి చిల్లర బుద్ధులో అర్ధం కాని ఆదిలక్ష్మి ఈ ఉంగరం ఎలా తేల్తుందో అని వేచి చూస్తోంది. పని మనిషి కూడా రాకముందు, మరింకెవరు లేని సమయంలో ఆ ఇద్దరిమధ్య ఉంగరం పోవడమే వింతగా ఉంది. ఒక వేళ ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు దాచేసి అబద్ధం చెప్పినా అది భర్త నుంచి దాచిన డబ్బు కొంత, అడిగి తీసుకున్నది కొంత కలిపి ఆకారం మార్చి అమ్మ చేయించిందని చెప్పి ఏదో ఒక రోజు గొప్పగా తనకి చూపించి వాడుకోవడం మొదలు పెడతారు.
ఎందుకంటే ఇద్దరికిద్దరూ ఇలాంట్ వాటిలో బాగా ఆరితేరిన వారు. ఉమ్మడిలో ఉన్నప్పుడు జాగ్రత్తలు, మెళుకువలు తెలిసిన దిట్టలు. పైగా క్రితం రోజునే పెద్దావిడ తల్లి వచ్చి వెళ్ళింది. బహుశా కూతుర్ని మందలించి 'మనకెందుకే ఈ తలనొప్పి, మళ్ళీ నెల్లో నీ చెల్లెలి పెళ్ళి కుడాను, సెంటిమెంటల్ గా ఇది ప్రధానపు ఉంగరం... అందుకని ఎక్కడో అక్కడ దొరికేలాగ పెట్టేసెయి అని చెప్పి కూతురుకిచ్చి వెళ్ళి ఉంటే త్వరలో దొరుకుతుంది. లేదా చిన్నావిడ దగ్గరే ఉండి ఉంటే అవకాశాన్ని బట్టి ఆకారం మారి ఎప్పుడో కనబడుతుంది... అని అనేకానేక ఆలోచన్ల తో సతమతమౌతున్న ఆదిలక్ష్మికి ఈ రోజు జవాబు దొరికింది. కాకపోతే అసలు చిక్కు విడలేదు. ఇద్దరిలో ఎవరన్నది వారి మధ్యనే ఉండిపోయింది. పెద్దావిడ బీరువా కింద పెట్టిందా? లేక చిన్నావిడ బీరువా కింద దొరికినట్టుగా చెప్పిందా? ఏది ఏమైతేనేం ఆకారం మారకుండా వచ్చిందంటే ఇద్దరి ప్లాను పారలేదన్న మాట? ఎవరి ఆలోచన్లు ఎలా ఉన్నా మొత్తానికి ఉంగరం దొరికిందన్న ఆనందం ఇల్లంతా నిండింది.
అయితే రాత్రి డైనింగు టేబుల్ దగ్గర మళ్ళీ ఒకసారి ఉంగరం గుర్తొచ్చింది అందరికీ. పోన్లె బాబు మన బంగారం మంచిది, ఉంగరం దొరికింది అన్నాడు పెద్దవాడు. అవును ప్రధాన పుంగరం కదా సెంటిమెంటల్ గా బాధనిపించింది అన్నాడు చిన్న వాడు. అంతా బాబా దయ అసలు పోయే అవకాశమే లేదు అన్నాడు మామగారు శర్మ. ఏది ఏమైతేనేం దొరికింది అంతే చాలు అంది ఆదిలక్ష్మి. అంతా విన్న కోడళ్ళు 'అత్తయ్య గారే తీసి దాచారనుకున్నాం' అన్నారు ముక్త కంఠంతో కూడ బలుక్కున్నట్టు. అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెర్రి మొహాలు వేశారు. హఠాత్తుగా విన్న ఆదిలక్ష్మి విస్తు బోయి చేష్టలుడిగి శిలా ప్రతిమలా ఉండిపోయింది.'కోడళ్ళూ మీకు జోహార్లు... మీరెంత కైనా తగిన వాళ్ళు... నిజంగా భగవంతుడనే వాడుంటే వాడే మిమ్మల్ని రక్షించాలి' బరువెక్కిన గుండెలతో పాటు మెదడుకుడా మొద్దు బారింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|