|
|
Articles: Short Stories | రైతక్క - Site Administrator
| |
కరువు పడ్డప్పుడు కైకిలి పోతే 'పద్మా... ఇద్దరు మొగోళ్ల పని జేత్తవు. నీ మొగడున్నడు వట్టి సావుబతుకులోడు. ఆడిదాని కంటె అద్వాన్నం' అని సగం కైకిలే చేతులపెట్టారు. ఆనాడు గుడ్ల నీళ్ళు గుడ్లల్ల కుక్కుకుంది. సబ్సిడీ ఇత్తనాలు ఇత్తున్నారని వెళ్తే తిప్పి పంపించినప్పుడు వచ్చి భర్తకు చెప్పితే 'ఔ... మరి రైతంటే నేనే. నన్నే రైతంటారు. నువ్వు రైతు వెట్యయితవు. నీ పేరు మీద ఎట్ల ఇత్తరు' అన్నప్పుడు మాత్రం కోపం వచ్చింది. మంటరమంట పంచాది ఆఫీసు ముందుకు పోయి అధికారులందరినీ కడిగిపోసింది.
తన శ్రమను గుర్తించని నాడు కోపం రాలేదు. శ్రమను దోపిడీ చేసిన నాడు కూడా కోపం రాలేదు. సాంఘీక అసమానతలేమిటో తెలియకపోయినా తనను రైతుగా గుర్తించకపోయేసరికి మాత్రం కడుపు మసిలి పని మానేసింది. అంతే! ఎద్దు ఎవుసం మూలకు పడింది. మళ్ళీ తనే మనసు నింపుకుని ముల్లుగట్టి చేత పట్టేదాకా పని సాగలేదు. మంచె మీద పాము కరిచి భర్త కన్నుమూసిననాడు ఎద్దు ఎవుసం మూలకు పడ్డట్టే అనుకున్నారంత. అప్పుడు తను ఆరు నెలల బాలింత. పుట్టెడు దు:ఖాన్ని మింగుకుని కొంగు నడుముకు చుట్టుకుంది. సాలులో సాలు కలిపింది. నారు పీకి నాటేసి పక్కవాళ్ళ కంటే ముందుగనే గడ్డకెక్కింది.
'పద్మ మొగరాజిగాడు. ఏ మొగోడు దాని మీద పనిజెయ్యడు. అని చుట్టుపక్కల వాళ్ళు అంటుంటె కోపమచ్చేది. శ్రమలో కూడా ఆడ, మగను వేరు చేసి పోల్చిచూపుడు ఎందుకన్న ప్రశ్న కలిగేది.' అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో రూపంలో ఆ ప్రశ్న పుడుతూనే ఉంది. ఆ మాటలంటున్న అధికారులందరినీ నిలదీసి తిడుతూనే ఉంది. నడుస్తూ నడుస్తూ టక్కున ఆగిపోయింది పద్మ. పక్క సందులోంచి అరుపులు. నెల కిందనే ఆ సందులో శవం లేచింది. అన్నీ తానై కుటుంబ బరువును మోసిన నర్సవ్వ అప్పుల బాదకు పరుగు మందు తాగింది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|