|
|
Articles: Festivals | దుర్గమ్మ కొలువైన వైనం - Site Administrator
| |
కనకదుర్గగా...
అప్పటిదాకా దుర్గగా కీర్తించబడిన దుర్గాదేవికి ఈ ప్రాంతంలో ఒకప్పుడు విపరీతమైన జంతుబలులు జరిగేవట...ఆది శంకరాచార్యుల వారు మార్గమధ్యంలో తారసిల్లిన ఇంద్రకీలాద్రి దుర్గమ్మను అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచి ఆ ప్రాంతంలో శ్రీ చక్రం ప్రతిష్టించారట. అప్పటినుంచి భక్తులు జంతుబలులు ఆపివేసి అమ్మవారిని ఎర్రటి కుంకుమతో పూజించడం ఆరంభించారు. ఒకప్పుడు పల్లవ రాజైన మాధవవర్మ విజయపురి పట్టణాన్ని రాజధానిగా చేసుకుని జనరంజక పాలన సాగించుచుండగా అతని కుమారుడు ఒకనాడు అశ్వముపై వేగిరముగా నడిరోడ్డుపై వెళుతుండగా ఒక చిన్నారి అతని అశ్వము కింద నలిగి అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టింది.
అంతట ఆ పసికందు తల్లి విలపిస్తూ మాధవవర్మ వద్దకు పోయి న్యాయము చేయవలసిందిగా అభ్యర్థించిందట. దానితో మాధవవర్మ తన కొడుకు తెలిసిచేసినా, తెలియక చేసినా అది తప్పే అని తీర్పుచెప్పి సొంత కుమారుడు అని ఆలోచించకుండా అతనికి ఉరిశిక్ష వేశాడు. అంతట మాధవవర్మ ధర్మనిరతికి మెచ్చి ఆ ఊరి దేవత అయిన దుర్గమ్మవారు విజయపురిలో గలగలా కనక వర్షాన్ని కురిపించిందట. అప్పటినుంచి విజయపురిలో నివసించే జనమంతా సిరిసంపదలతో, భోగభాగ్యములతో సుఖంగా జీవించారని మరో గాథ ప్రచారంలో ఉండేది. కనకపు వర్షాన్ని కురిపించిన అమ్మవారిని అప్పటినుంచి కనకదుర్గగా కొలవడం ఆరంభించారు.
దసరా శరన్నవరాత్రోత్సవాలు
ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆ రోజు మాత్రం విశేష పూజలు జరుపుతారు. భక్తుల తాకిడి కూడా ఆ రోజు ఎక్కువగానే ఉంటుంది. అయితే అమ్మవారికి జరిపే ఉత్సవాలలో చెప్పుకోదగినది శరన్నవరాత్రి ఉత్సవాలు. అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరపడం ఇక్కడి ఆనవాయితీ. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో మొదలయ్యే పాడ్యమి నుంచి దశమి వరకూ దసరా ఉత్సవాలుగా జరిపిస్తారు. ఒక్కోరోజు ఒక్కో అలంకారంగా అమ్మవారిని శోభాయమానంగా అలంకరిస్తారు. బాలాత్రిపురసుందరి, అన్నపూర్ణ, రాజరాజేశ్వరి, గజలక్ష్మి, గాయత్రి, లలితాదేవి, సరస్వతి, దుర్గ, మహిషాసురమర్ధిని అనే నవరూపాలలో అమ్మవారిని అలంకరించి విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఈ నవరూపాలు చూడటానికి ప్రతి సంవత్సరం భక్తులు లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వస్తుంటారు.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|