|
|
Articles: Festivals | దుర్గమ్మ కొలువైన వైనం - Site Administrator
| |
విజయదశమి
ఒకప్పుడు విజయదశమి తొమ్మిది రోజులను మూడు భాగాలుగా విభజించి తొలి మూడురోజులు పార్వతిగా, తరువాతి మూడురోజులు లక్ష్మిగా, తదుపరి మూడు దినాలను సరస్వతిగా కొలిచే వారట. విద్యార్థులు తమ పుస్తకాలను అమ్మవారి వద్ద నుంచి పూజలు జరిపిస్తారు. ఇప్పుడు కూడా మూలా నక్షత్రం తిథి రోజున అమ్మవారిని ధవళవస్త్రాలతో చదువుల తల్లి సరస్వతిగా అలంకరించడం ఆనవాయితీ. ఆ రోజు ప్రత్యేకంగా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం కూడా జరిపిస్తుంటారు.
విజయదశమి అనగా విజయాలకు గుర్తుగా భావించి ఆ రోజు త్రికరణ శుద్ధిగా మొదలెట్టిన కార్యం జయప్రదం అవుతందని అపారమైన నమ్మకం. విజయ దశమినాడు కొన్ని ప్రాంతాల వారు జమ్మిచెట్టును విధిగా పూజించడం అనవాయితీ. జమ్మిచెట్టును పూజించి తమ కోర్కెలను చీటీలపై రాసి చెట్లకు వేళ్లాడదీస్తారు. మహాభారతంలో విరాటపర్వం ఘట్టంలో పాండవులు మారువేషాలతో విరాటరాజు కొలువులో చేరేముందు శ్రీకృష్ణుని సలహా మేరకు తమ ఆయుధాలను జమ్మిచెట్టుమీద దాచి ఉంచినారట. అన్యులకెవ్వరికీ ఈ ఆయుధాలు కనిపించకుండా కృష్ణుడు మాయపొరను కప్పివుంచాడట. అజ్ఞాతవాసం అనంతరం పాండవులు తిరిగి తమ రాజ్యానికి వెళుతూ మార్గమధ్యంలో జమ్మిచెట్టును పూజించి తమ ఆయుధాలను తిరిగి తీసుకుని అవే ఆయుధాలతో కౌరవులతో ధర్మయుద్ధం చేసి విజయం సాధించారు.
అందుచేత అప్పటినుంచి జనానికి ఆయుధపూజ చేయడం కూడా ఆనవాయితీగా వస్తోంది. ఆంధ్ర ప్రాంతంలో దసరా ఉత్సవాలలో భాగంగా కొందరు కళాకారులు దసరా వేషములతో అలరిస్తుంటారు. పూర్వం ఉపాధ్యాయులు పిల్లలచేత పాటలు పాడించుకుంటూ దసరా కానుకలను పొందేవారట. ‘అయ్యవారికి చాలా ఐదు వరహాలు...పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు...జయీ భవ...విజయీ భవ’ అంటూ గ్రామాలలో తిరుగుతూ పిల్లవాళ్లకు చిన్నచిన్న కానుకలు ఇస్తూ తాము వరహాలను (డబ్బులు) తీసుకునేవారు. అప్పటినుంచి దసరా మామూలు కూడా ఒక ఆనవాయితీగా వస్తోంది. తర్వాత మామూళ్లు అనే పదం లంచాలకు ప్రతిరూపంగా తయారయిందని దానిని రద్దు చేశారు. ఇప్పుడు దసరా మామూలు ఆచారం ఎక్కడా లేదు. కొన్ని ప్రాంతాలలో బొమ్మల కొలువును పెట్టి దసరాలలో తమ బంధుమిత్రులను, ఇరుగుపొరుగువారిని పిలిచి ఆడవారు పేరంటాలు జరుపుకోవడం మరో ప్రత్యేకత... కొండపైన వెలసిన దుర్గా నీకు కోటి దండాలు అంటూ భక్తులు తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|