|
|
Articles: My Thoughts | మానవ హక్కులు హరీ! - Site Administrator
| |
భోపాల్ లో గ్యాస్ దుర్ఘటన జరిగి, వేలాది మంది ప్రజలు మృతిచెంది, లక్ష మందికి పైగా ప్రజలు గాయాలకు, అంగవైకల్యానికి గురై 25 సంవత్సరాలు అవుతున్నది. ఇంతవరకు అందుకు బాధ్యులైన అమెరికా కంపెనీ పై భారత ప్రభుత్వం ఎలాంటి చర్యా తీసుకోలేకపోయింది. బహుళజాతి సంస్థల అరాచక అహంకార ధోరణలకు, ప్రభుత్వాల ప్రేక్షకపాత్రకు ఇంతకన్నా వేరే దృష్టాంతం కావాలి?
మానవ హక్కుల ఉద్యమాలు సహితం ప్రపంచ వేదికలకు సైబర్ ప్రపంచానికి పరిమితం అవుతున్నాయి. ప్రజలను కదిలించలేకపోతున్నాయి. అందుకనే మన పొరుగున ఉన్న శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ లలో జరుగుతున్న మానవ మారణకాండపై ప్రపంచదేశాలు, మానవహక్కుల సంఘాలు ప్రేక్షకపాత్ర వహించడం ఈ సందర్భంగా ఆందోళన కలిగిస్తున్నది.
అభివృద్ధి చెందుతున్న దేశాలలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను గమనిస్తే అందులో 83 శాతం గనుల త్రవ్వకానికే కావడం గమనార్హం. ఆర్థిక సంస్కరణల అనంతరం మనదేశంలోకి ఈ పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా అది మన జిడిపిలో 4 శాతంకు మించడం లేదు. విదేశీ పెట్టుబడులు మన సమగ్ర ఆర్థిక వికాసానికి దోహదపడటం లేదని గమనించాలి.
విదేశీ పెట్టుబడుల మోజులో బహుళజాతి సంస్థలకు అనేక సదుపాయాలు కల్పిస్తున్న భారత్ వంటి ప్రభుత్వాలు ఇతర స్వదేశీ పరిశ్రమల వలె అవి కూడా చట్టబద్ధంగా పనిచేయాలని గుర్తించడం లేదు. చట్టానికి అతీతమైన సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి. అందుకనే బహుళజాతి సంస్థల వ్యవహారాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన ప్రారంభమయింది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|