|
|
Articles: My Thoughts | మానవ హక్కులు హరీ! - Site Administrator
| |
(చలసాని నరేంద్ర)
ప్రపంచీకరణ ధోరణుల ఫలితంగా గత రెండు, మూడు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకరమైన పరిణామాలు నెలకొంటున్నాయి. ప్రభుత్వాల సార్వభౌమాధికారం పరిమితమై బహుళజాతి సంస్థలు గతంలో ఎన్నడూలేని విశేష అధికారులు చెలాయిస్తున్నాయి. భారతదేశంలో కేవలం వ్యాపార నిమిత్తం వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకొని, 200 సంవత్సరాలకు పైగా బ్రిటన్ కు వలసదేశంగా మార్చివేసిన చరిత్రను మరువలేము. నేడు బహుళజాతి సంస్థలు సహితం ఆ విధమైన స్థితిలో ఉన్నాయి. అమెరికా వంటి దేశాలలో సహితం రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక విధానాలను ఈ సంస్థలు ప్రభావితం చేస్తున్నాయి.
ప్రపంచంలో 20 బహుళజాతి సంస్థల ఆర్థికవనరులు ఫిలిప్పెయిన్స్ వంటి దేశాలకన్నా ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక సంస్థల నివేదికను పరిశీలిస్తే ప్రపంచీకరణ విధానాల ఫలితంగా చైనాలో మినహా అన్ని దేశాలలో పేదరికం విశేషంగా పెరిగింది. ధనిక-పేద తారతమ్యాలు పెరిగాయి. చైనాకు సంబంధించి కూడా సాధికారిక మైన గణాంక వివరాలు అందుబాటులో లేవు. ఆ దేశంలో సహితం తారతమ్యాలు బాగా పెరుగుతున్నట్లు తెలుస్తున్నది.
కేవలం విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనే తపనతో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు బహుళజాతి సంస్థలను ఆహ్వానిస్తున్నాయి. అయితే ఆ విధంగా వస్తున్న విదేశీ పెట్టుబడులు 83 శాతం గనుల త్రవ్వకాలకేనని గుర్తించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలలోని అపారమైన సహజవనరులను 'అపహరించి', వాటికి కాలుష్యాన్ని అందజేసి, ఆయా దేశాలను పిప్పిచేసి, సంపన్న దేశాలకు సంపదను తరలించడంతో బహుళజాతి సంస్థలు కీలక పాత్ర వహిస్తున్నాయి.
బహుళజాతి సంస్థలు కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా ప్రజల హక్కులను హరించి వేస్తున్నాయి. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు కారణమవుతున్నాయి. విదేశీ పెట్టుబడుల మోజులో బహుళజాతి సంస్థలకు స్వాగతం పలుకుతున్న భారత్ వంటి దేశాలు వాటి తీరుపై ఎలాంటి నియంత్రణ చేయలేకపోతున్నాయి. మానవ హక్కుల గురించి అంతర్జాతీయ సంస్థలపై సుదీర్ఘ ప్రసంగాలు చేసే సంపన్న దేశాలు సహితం తమ దేశానికి చెందిన బహుళజాతి సంస్థలపై తీరు ఎలాంటి బాధ్యత వహించడం లేదు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|