|
|
Articles: My Thoughts | మానవ హక్కులు హరీ! - Site Administrator
| |
ఈ ఆందోళనను గుర్తించిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఈ విషయమై పరిశీలనకు జాన్ రెడ్లేని ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. గత సంవత్సరం అంతర్జాతీయ మానవ హక్కుల మండలికి నివేదిక సమర్పించిన ఆయన ఈ అంశంపై సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. అయితే ఆయన ధోరణి బహుళజాతి సంస్థలను చట్టబద్ధంగా నియంత్రించగల వ్యవస్థ ఏర్పాటు దిశగా లేకపోవడం విచారకరం.
బహుళజాతి సంస్థలు మానవహక్కులు అన్నింటినీ గౌరవించాలని మాత్రమే పేర్కొనడం ద్వారా వాటిని నియంత్రించే నియమావళి గురించిన వాదనలను దాటవేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది. బహుళజాతి సంస్థల బాధ్యతారహిత వైఖరిని అదుపు చేయడం పట్ల అగ్రరాజ్యాలు ఏవీ సిద్ధపడటం లేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా బహుళజాతి సంస్థల పనితీరు పట్ల వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని గమనించి, వాటి నియంత్రణకు ఐక్యరాజ్యసమితి స్పందించక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయని భావించిన సంపన్నదేశాలు ఓసిఇడి అనే సంస్థను ప్రారంభించాయి.
ఆర్థిక సహకారం, అభివృద్ది సంస్థగా ప్రారంభించిన 30 దేశాలు ఈ సంస్థ ద్వారా బహుళజాతి సంస్థల పనితీరుపై ఫిర్యాదులను పరిశీలించే యంత్రాంగం ఏర్పాటు చేశాయి. అయితే బహుళజాతి సంస్థలు మానవ హక్కులు ఉల్లంఘించే విధంగా పనిచేయడానికి వీలు కల్పిస్తున్న ఆయా దేశాల విధానాలను ప్రశ్నించే అవకాశం కల్పించడం లేదు. అయితే ఓసిఇడి ఫిర్యాదులపై స్పందించి ఇరువర్గాలను సమావేశపరచి ఒక ప్రకటన మాత్రమే చేయగలవు. బహుళజాతి సంస్థలను ఆదేశించే అధికారంగానీ, ఆ ప్రకటన అమలును పర్యవేక్షించే యంత్రాంగం గానీ దీనికి లేదు.
వివిధ దేశాలలో అమలులో ఉన్న సాధారణ చట్టాలకు అతీతంగా వ్యవహరించే అధికారం బహుళజాతి సంస్థలకు కల్పించడం తగునా? గంభీరంగా ఆలోచించాలి. బహుళజాతి సంస్థల నేరాలను విచారించి, బాధితులకు తగు ఉపశమనం కల్పించడంలో దేశీయ కోర్టులు విఫలమవుతున్నట్లు భోపాల్ దుర్ఘటన వెల్లడిచేసింది. బహుళజాతి సంస్థల నేరాలను విచారించే అధికారం అంతర్జాతీయ మానవహక్కుల కోర్టుకు కల్పించాలి. ఈ విషయమై చర్చించడానికి ఐక్యరాజ్యసమితి ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి. బహుళజాతి సంస్థల నేరాల అదుపుపై సభ్యదేశాలు ఒక అంతర్జాతీయ ఒడంబడికను చేసుకోవాలి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|