|
|
Articles: My Thoughts | సత్యాన్వేషి సర్వేపల్లి - Site Administrator
| |
విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల నియామకంలో అత్యున్నత ప్రమాణాలు ఉన్నవారిని నియమించటంలోను, విద్యార్థులు అధ్యాపకుల మధ్య పటిష్ఠమైన గురుశిష్య సంబంధాలు నెలకొల్పటంలోను ఆయన గట్టి పునాదులు వేశారు. తదనంతరం ఉన్నత విద్యాప్రమాణాలను నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటయిన ఉన్నత విద్యా సంస్కరణల కమిషన్ కి ఆయన 'చైర్మన్'గా వ్యవహరించారు. భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యునిగా, రష్యాలో భారత రాయబారిగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఆయన అత్యున్నత పదవులను అధిరోహించారు. గొప్ప విద్యావేత్త, మహామేధావి, ప్రఖ్యాత తత్త్వవేత్త, మానవతావాది, నిరాడంబరుడుగా పేరుగాంచిన ఆయన విద్యారంగానికి, రాజకీయ రంగానికి చేసిన సేవ అపారమైంది. ఎన్నో విశ్వవిద్యాలయాలు ఆయన్ని గౌరవ డాక్టరేట్లతో గౌరవించాయి. ఆయన చేసిన అపారమైన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1969లో 'భారతరత్న' బిరుదుతో గౌరవించింది.
ఇంత గౌరవాన్ని అందుకొన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ అచ్చంగా మన తెలుగుబిడ్డే! మనం ఎంతో ఆనందించవలసిన, గర్వపడలసిన విషయం ఇది. 'ఉపాధ్యాయుడు నిరంతరం నేర్చుకుంటే తప్ప నిజమైన చదువు చెప్పలేడు' అనే సూక్తి ప్రకారం రాధాకృష్ణన్ నిరంతర సత్యాన్వేషి. విద్యార్థులుగా ఉన్నప్పుడే క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ప్రవర్తన, కష్టపడేతత్వం అలవడాలి. అవే భావి బాటకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. ఉపాధ్యాయులు - విద్యార్థులకు మధ్య ఆత్మీయతా భావంతో కూడుకొన్న సత్సంబంధాలు ఉండాలి. అటువంటి సంబంధాల పరిరక్షణకు ఇటు ఉపాధ్యాయులు, అటు తల్లితండ్రులే కాక సమాజం కూడా తనవంతు భాగస్వామ్యాన్ని అందించాలి.
అయితే దురదృష్టవశాత్తు ఈ రోజు అన్ని విధాలుగా విద్యాబోధకులు, విద్యాగ్రహీతలు కూడా దేనినీ 'నిబద్ధత'తో స్వీకరించలేకపోతున్నారు. అట్లా అని మొత్తం వ్వవస్థంతా ఇట్లాగే ఉందా అంటే ఎక్కువ శాతం క్షీణదశ వైపే ప్రయాణం సాగిస్తున్నదని చెప్పక తప్పదు. ప్రాథమిక విద్య నుండి కూడా మాతృభాష పట్ల హేళన, తక్కువదనం. చిన్నచిన్న గ్రామాల్లో సైతం ఇంగ్లీషు మాధ్యమ పాఠశాలలు కుప్పలుతెప్పలుగా వెలియటంతో ఇటు ఇంగ్లీషు రాక, అటు తెలుగు రాక విద్యార్థులు రెంటికీ చెడ్డ రేవడులవుతున్నారు. మన సంస్కృతీ, సంప్రదాయం, నాగరికత వీటి గురించిన అవగాహనకు మాతృభాష కంటే మరే భాష దోహదకారి కాజాలదు. ప్రాథమిక విద్య నుండి హైస్కూలు, కాలేజి విద్యకు వచ్చేసరికి కొన్ని సబ్జెక్టుల పట్ల కొందరు ఉపాధ్యాయుల పట్ల చిన్నచూపు... ముఖ్యంగా తెలుగు, సోషల్ వంటి సబ్జెక్టులు ఎందుకూ పనికిరానివని తోటి ఉపాధ్యాయులు, సమాజం కూడా అభిప్రాయపడుతుంటుంది. దాంతో విద్యార్థుల్లో కూడా వాటినంత క్షుణ్ణంగా అభ్యసించాలా ఏమిటి అనే ధోరణి ప్రబలుతోంది. లెక్కలు, సైన్సు బోధించే ఉపాధ్యాయులు తమదే పై చేయి అనే ధోరణితో వ్యవహరించటం- తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు సైన్సు మాథ్స్ లలో ప్రవేశించగానే డాక్టర్లో, ఇంజనీర్లో అయినట్లు ఊహించుకోవడం... ఇవి బోధించేవారు తప్ప తక్కిన వారిపట్ల గౌరవ ప్రపత్తులు చూపటం అనవసరం అనుకోవటం...
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|