|
|
Articles: My Thoughts | సత్యాన్వేషి సర్వేపల్లి - Site Administrator
| |
సమాజం కోరుకొనే విలువలను పిల్లల్లో సజీవంగా నిలుపుకోవడానికి పాఠశాల ఒక ఏజెన్సీగా పనిచేస్తుంది. సమాజం అంగీకరించిన విలువలను అలవాటు చేసుకోవడానికి విద్య దోహదపడుతుంది. పిల్లవాడు ఒక సమూహంలో కలసిమెలసి ఉండడానికి, మంచి ఆలోచనలు అభివృద్ధి చేసుకోవటానికి, మంచిగా జీవించటానికి, సమాజంలో నిర్మాణాత్మకమైన సభ్యునిగా ఎదగటానికి విద్య తోడ్పడుతుంది. ఆహా! అన్ని చదవటానికి, వినటానికి బాగానే ఉన్నాయి. అయితే వాస్తవ పరిస్థితులను ఆలోచించి చూస్తే ఇవ్వాళ విద్య అన్నది మనుషుల్ని మానవత్వం వైపు నడిపేలా ఉందా? కేవలం 'ర్యాంకులు' సంపాదించే యంత్రాలుగా తయారుచేస్తున్నదా అనేది మన ముందున్న ప్రశ్న. పుస్తకంలో ఉన్నదేదో చెప్పటానికే తమకు టైము చాలటం లేదని, ఇంకా కొత్త విషయాలను, ఆదర్శాలను ఎట్లా చెబుతాం అనే ఉపాధ్యాయులు ఉన్నారు. ఎమర్సన్ అనే తత్వవేత్త 'తరగతి గదిలో ప్రపంచాన్ని సృష్టించమంటాడు'. అంతేకాదు ఉపాధ్యాయుడు 'Mother Art'ని నేర్చుకోవాలంటాడు. అంత తీరిక, ఓపిక నేటి ఉపాధ్యాయులకెక్కడిది! పిల్లల్ని కన్న తల్లి తండ్రులకే వాళ్ళను పట్టించుకొనే సమయం దొరకటం లేదు.
సమాజం అంగీకరించే విలువలు సమయానుకూలంగా మారుతూ ఉండవు. కాని నేటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సినిమాలు విద్యార్థుల, ఉపాధ్యాయుల మధ్య ఆత్మీయతా సంబంధం, గౌరవ మర్యాదలు, భక్తి ప్రపత్తులు, పుత్ర వాత్సల్యం చూపటానికి బదులుగా టీచర్లను పిల్లలు ఎంతమేర అవమానించవచ్చునో అంతా చూపుతున్నారు. పిల్లలు టీచర్లను బెదిరించటం, లేదంటే విద్యార్థులతో పాటు పిల్లలు కలసి డ్యాన్స్ లు చేయటం, మందు కొట్టడం వంటివి సమాజం ఆమోదించే విలువలా?
విద్యార్థుల్లో మతసహనం, సహజీవన దృక్పథం, పాఠశాల దశ నుండే నేర్పాలి. కాని దురదృష్టవశాత్తు మన సమాజంలో నెలకొన్న కుల, వర్గ భేదాలు విద్యార్థుల మీద కూడా ప్రభావం చూపుతున్నాయి. కులసంఘాల పేరుతో, అభిమాన హీరోల, సంఘాల పేరుతో విద్యార్ధి లోకంలో అలజడి సృష్టిస్తున్నాయి. అధ్యాపకుల్లో కొందరు పిల్లల పేర్లలో ఉన్న తోకలను చౌదరి - రెడ్డి - నాయుడు మొదలైనవాటిని పట్టుకొని మనవాడేననే పక్షపాత ధోరణిని అవలంబించటం మనం చూస్తున్నదే! ఈ అభిమానాలు అంతటితో ఆగటంలేదు. ప్రాక్టికల్స్ లో తమ వాళ్ళకు ఎక్కుల మార్కులు వేయటం - పరీక్షల్లో కాపీ కొడుతున్నా పట్టించుకోకపోవడం... ఇటువంటి వాటికి దారితీస్తున్నాయి. నిష్పక్షపాత వైఖరిని అవలంబించవలసిన ఉపాధ్యాయులే ఇట్లా ఉంటే విద్యార్థులేం నేర్చుకుంటారు? ఎంత వద్దన్నా ఉపాధ్యాయుని ప్రభావం ఏదో ఒక విధంగా విద్యార్తుల మీద పడకమానదు. అందుకే సమాజానికి మూలస్తంభాల్లాంటి వాళ్ళు ఉపాధ్యాయులన్నారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|